గుంటూరు టీడీపీ లోక్సభ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ ఆధ్వర్యంలోని అమరరాజా గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ కంపెనీ తాజాగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా 500 బెస్ట్ ఎంప్లాయర్స్ జాబితాలో అమరరాజా కంపెనీ నిలిచింది. ఈ విషయాన్ని అమరరాజ గ్రూప్ మంగళవారం స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ప్రజల విలువ తెలిస్తే పోటీలో ముందుంటామన్న విషయాన్ని తాము నమ్ముతామని.. విశ్వాసం, గౌరవం అన్నవే ఆ నమ్మకానికి కారణమని కూడా అమరరాజ గ్రూప్ ట్వీట్లో తెలిపింది. ఆ దిశగా పయనించినందుకే తాము ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నామని అభిప్రాయపడింది. ఈ నమ్మకంతోనే మరింత వృద్ధిని సాధిస్తామని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా అమరరాజా కంపెనీ చిత్తూరు జిల్లా కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం కరకంబాడీలో ఉంది. ఈ సంస్థ అమరాన్ పేరుతో బ్యాటరీలు అమ్మడంలో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అటు అమరరాజా బ్యాటరీస్ గ్రూప్కు చెందిన అమరరాజా పవర్ సిస్టమ్స్.. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ను లేహ్, లడాఖ్లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) నుంచి పొందినట్లు ఇటీవల అమరరాజా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని తెలిపారు.
ARG is one of the top ranking companies in Forbes 500 best employers list.
We believe that if you value people, you can get a competitive advantage. Trust and respect are at the core of that belief, the belief that we can become #BetterTogether.https://t.co/MZqEwGBO2t pic.twitter.com/It2hqCXXIQ
— Amara Raja (@AmaraRaja_Group) July 5, 2022