Lokesh: విశాఖకు సీఎం జగన్ ఎంత తొందరగా వెళ్తే మాకు అంత మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం వైఎస్ జగన్ ఎంత త్వరగా విశాఖ వెళ్లి కూర్చొంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయి.. సీఎం వెళ్తే మరింతగా పెరుగుతాయని.. విజయసాయి దెబ్బకు ఇప్పుడు విశాఖలో అందరూ భయపడుతున్నారు.. రేపు సీఎం వెళ్తే ఆయనకు భయపడతారని మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు.. 1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడన్న లోకేష్… పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి.. పరిపాలనా వికేంద్రీరణ అంటే పరిపాలనా విధ్వంసమే నని.. అభివృద్ది వికేంద్రీకరణ చేసింది మేమే అన్నారు.. టీడీపీ హయాంలో వచ్చిన 5.40 లక్షల ఉద్యోగాలు 13 జిల్లాల్లో వచ్చాయే తప్ప.. ఒక్క ఉద్యోగం కూడా అమరావతి ప్రాంతానికి రాలేదన్న ఆయన.. పరిపాలనా ఒకే చోట ఉంచి.. అన్ని జిల్లాల్లో అభివృద్జి చేయాలనేదే మా లక్ష్యంగా స్పష్టం చేశారు. మా లక్ష్యానికి అనుగుణంగా ఆటోమొబైల్ అనంతపురం, ఖనిజాలు, సోలార్ కంపెనీలు కర్నూలు, ఐటీ విశాఖ, ఎలక్ట్రానిక్స్ చిత్తూరు జిల్లాల్లోకి తెచ్చామని.. మేం తెచ్చిన వాటిని కంటిన్యూ చేసినా చాలా పరిశ్రమలు వచ్చుండేవి.. కానీ, వచ్చీ రావడంతోనే పీపీఏల రద్దు అంటూ ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పుట్టించారని.. పీపీఏల రద్దు కారణంగా సుజలాన్ అనే అతి పెద్ద కంపెనీ దివాళ తీసింది.. అందులో పెట్టుబడులు పెట్టిన చాలా పెద్ద పెద్ద కంపెనీలు దెబ్బతిన్నాయన్నారు.
Read Also: AP: సీఎస్కు ఐపీఎస్ అధికారి ఏబీవీ లేఖ.. ఆ అధికారం మీకు లేదు..!
Also Read
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Vizag Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు!
ఇక, మేం చేసుకున్న ఒప్పందాలు కంటిన్యూ చేసి ఉంటే విశాఖలోనే అదానీ డేటా సెంటర్ ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు, 70 వేల ఉద్యోగాలు వచ్చేవి.. విశాఖ రూపు రేఖలే మారేవన్నారు నారా లోకేష్.. ఏమీ చేయలేని తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకే సీఎం జగన్ మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు.. రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేని వాళ్లు మూడు రాజధానులు కడతారా..? అని ప్రశ్నించిన ఆయన.. ఇన్ని మాట్లాడుతోన్న జగన్.. అమరావతే రాజధాని అని నిర్ణయం జరిగిన రోజు.. విశాఖలోనో.. విజయవాడలోనో రాజధాని పెడదామని ఎందుకు చెప్పలేకపోయారు..? ఆ రోజు అమరావతికి మద్దతు పలికి.. ఇవాళ కాదనడం మోసం కాదా..? అంటూ నిలదీశారు. తమ శాఖ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. ఏ పని కావడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.. అన్ని ఓ చోట ఉన్నప్పుడే పనులు కానప్పుడు.. మూడు వ్యవస్థలు మూడు చోట్ల ఉంటే పనులెలా అవుతాయని ప్రశ్నించారు. రాజధానుల వల్లే అభివృద్ధి జరుగుతుందంటే.. 175 నియోజకవర్గాల్లో 175 రాజధానులు పెట్టొచ్చుగా..? అంటూ సెటైర్లు వేసిన లోకేష్.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే ప్రజల పరిస్థితేంటీ..? అని మండిపడ్డారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి శ్రీలంక ఆర్ధిక పరిస్థితితో సమానంగా ఉందన్న ఆన.. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఏదో రోజు ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వస్తుందని.. ఆర్ధిక ఎమర్జెన్సీ వస్తే బ్యాంకుల్లో ఉన్న ప్రజల డబ్బు, బంగారాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, నాణ్యత లేని మద్యం వల్ల 42 మంది ప్రాణాల పోయాయి.. అందుకే సభలో పోరాడామని తెలిపారు లోకేష్.. మా పోరాటం వల్లే సీఎం జగన్ నోరు విప్పారన్న ఆయన.. నాన్న బుడ్డి వల్లే అమ్మ ఒడి ఇవ్వగలుగుతున్నామని బహిరంగంగా చెప్పారని.. ఈ ప్రభుత్వం మద్యం మీదే మనుగడ సాగిస్తోందని సీఎంతోనే చెప్పించడం మేం సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో తదుపరి ప్రణాళిక సిద్దం చేసుకుంటామని వెల్లడించారు నారా లోకేష్.
తాజావార్తలు
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..