చంద్రబాబు టీడీపీ కేడర్ను మోసం చేస్తున్నారు : వల్లభనేని వంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ, టీడీపీ నానా యాగీ చేస్తున్నాయి. రూ. 50 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెరిగేలా చేసింది బీజేపీ అని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తన హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనే విషయాన్ని అల్జీమర్స్ సోకిన చంద్రబాబు మరిచారు. ధర్నాలు పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వాస్తవాలు దాచి ధర్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. చంద్రబాబుకు కేంద్రం పేరెత్తాలంటే వెన్నులో వణుకు. గడచిన ఎన్నికల్లో మోడీని తిట్టిన తిట్టకుండా తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన పేరెత్తే సాహసం చేయడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక తన ఎంపీలను బీజేపీకి పంపారు చంద్రబాబు.
ఇక తమది జాతీయ పార్టీలు.. అంతర్జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తెలంగాణలో ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గించాలని ధర్నాలు చేయడం లేదు. తడవకొకరును తెర మీదకు తెచ్చి ఏదో డ్రామాలాడుతున్నారు. ఓసారి నిమ్మగడ్డను తెస్తారు.. మరోసారి ఇంకో గడ్డను తెస్తారు. ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు అబద్దాలు చెబుతూ చంద్రబాబు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్ ప్రభుత్వం కేవలం రూపాయి మాత్రమే రోడ్ సెస్ పేరుతో వసూలు చేస్తోంది. చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అల్జీమర్సే కాదు.. పిచ్చిపట్టిందనే నిర్ణయానికి ప్రజలు వస్తారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా చంద్రబాబు టెంట్ మూసేస్తారు.. షెడ్ తీసేస్తారు. చంద్రబాబు చెప్పాడని పెట్రోల్ బంకుల ముందు హరన్ కొట్టడం ఏంటీ. కరెంట్ ఛార్జీలు పెరిగాయని కరెంట్ తీగలు.. ట్రాన్సఫార్మర్లు పట్టుకోమంటే పట్టుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ప్రజల నుంచి వసూల్ చేసిన సెస్ను పోలవరంలో పులిహోరకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు తెలుగుదేశం కేడర్ను మోసం చేస్తున్నారు అని పేర్కొన్నారు.
Also Read
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
- Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!