Pattabhi Ram: ఈడీ నోటీసులతో మాకేం భయం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక లావాదేవీలపై ఏ దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసినా.. ఈడీ దాని గురించి ఆరా తీస్తుందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం. .ఇందులో నిజానిజాలేంటని నిగ్గు తేల్చేందుకే ఈడీ నోటీసులిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఐడీ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈడీ నోటీసులతో మేమేం భయపడడం లేదన్నారు. నోటీసులు ఇచ్చిన వాళ్లు అక్కడికి వెళ్లి సమాధానం చెబుతారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఏం పీకింది..?ఏడాది నుంచి సీఐడీ ఏం గడ్డిపీకలేకపోయింది.. ఈడీ నోటీసులకు మేం భయపడతామా..? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Jagapathi Babu: రమ్, విస్కీ, బ్రాందీ, చెత్త చెదారం అన్ని ఇదే నాకు
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
చంద్రబాబు మీద.. ఘంటా సుబ్బారావు మీద ఆధారాలేం నిరూపించగలిగారు..?ఈడీ తాటాకు చప్పుళ్లకు.. నోటీసులకు మేం కంగారుపడం.మేమేమన్నా విజయసాయిరెడ్డిలా చంద్రబాబు, లోకేష్లు తమ ఫోన్లు పోయాయని ఫిర్యాదులు చేస్తారా..? మాకా ఖర్మ పట్టలేదు.స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా చాలా మందికి శిక్షణ ఇచ్చారు.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా చాలా మందికి ఉపాధి లభించింది.నిరుపేదలకు ఉపాధి లభిస్తోంటే సీఎం జగన్కు నచ్చడం లేదు.2020 మార్చి నాటికి 2.12 లక్షల మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లల్లో ట్రైనింగ్ ఇచ్చారన్నారు.
64 వేల మందికి ఉపాధి లభించిందన్నారు పట్టాభిరాం. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు నెలకొల్పిన చాలా కాలేజీలు గుడ్ కండిషన్లో పరికరాలు అందాయని సర్టిఫై చేశారు.గుడ్ కండిషన్లో పరికరాలు తీసుకున్నామని 2021 ఆగస్టులో కాలేజీల నుంచి లేఖలు వస్తే.. డిసెంబర్ 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..?అలాగే సీమెన్స్ సప్లై చేసిన పరికరాలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ టూల్ డిజైన్స్ సంస్థ సర్టిఫికెట్ ఇచ్చింది.ఒక్కొ క్లస్టర్కు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్న అంచనాను ఇంటెలిజెన్స్ ఆఫ్ టూల్ డిజైన్స్ సంస్థ నిర్ధారించింది.ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ప్రేమ్ చంద్రారెడ్డి, రావత్, అజేయ్ జైన్ వంటి వారికి సీఐడీ ఎందుకు విచారించ లేదని పట్టాభి ప్రశ్నించారు.
Read Also: Kalva Srinivasulu:రాయలసీమకు తీరని అన్యాయం చేసింది జగనే
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!