Pattabhi Ram: ఈడీ నోటీసులతో మాకేం భయం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక లావాదేవీలపై ఏ దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసినా.. ఈడీ దాని గురించి ఆరా తీస్తుందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం. .ఇందులో నిజానిజాలేంటని నిగ్గు తేల్చేందుకే ఈడీ నోటీసులిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఐడీ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈడీ నోటీసులతో మేమేం భయపడడం లేదన్నారు. నోటీసులు ఇచ్చిన వాళ్లు అక్కడికి వెళ్లి సమాధానం చెబుతారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఏం పీకింది..?ఏడాది నుంచి సీఐడీ ఏం గడ్డిపీకలేకపోయింది.. ఈడీ నోటీసులకు మేం భయపడతామా..? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Jagapathi Babu: రమ్, విస్కీ, బ్రాందీ, చెత్త చెదారం అన్ని ఇదే నాకు
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
చంద్రబాబు మీద.. ఘంటా సుబ్బారావు మీద ఆధారాలేం నిరూపించగలిగారు..?ఈడీ తాటాకు చప్పుళ్లకు.. నోటీసులకు మేం కంగారుపడం.మేమేమన్నా విజయసాయిరెడ్డిలా చంద్రబాబు, లోకేష్లు తమ ఫోన్లు పోయాయని ఫిర్యాదులు చేస్తారా..? మాకా ఖర్మ పట్టలేదు.స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా చాలా మందికి శిక్షణ ఇచ్చారు.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా చాలా మందికి ఉపాధి లభించింది.నిరుపేదలకు ఉపాధి లభిస్తోంటే సీఎం జగన్కు నచ్చడం లేదు.2020 మార్చి నాటికి 2.12 లక్షల మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లల్లో ట్రైనింగ్ ఇచ్చారన్నారు.
64 వేల మందికి ఉపాధి లభించిందన్నారు పట్టాభిరాం. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు నెలకొల్పిన చాలా కాలేజీలు గుడ్ కండిషన్లో పరికరాలు అందాయని సర్టిఫై చేశారు.గుడ్ కండిషన్లో పరికరాలు తీసుకున్నామని 2021 ఆగస్టులో కాలేజీల నుంచి లేఖలు వస్తే.. డిసెంబర్ 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..?అలాగే సీమెన్స్ సప్లై చేసిన పరికరాలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ టూల్ డిజైన్స్ సంస్థ సర్టిఫికెట్ ఇచ్చింది.ఒక్కొ క్లస్టర్కు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్న అంచనాను ఇంటెలిజెన్స్ ఆఫ్ టూల్ డిజైన్స్ సంస్థ నిర్ధారించింది.ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ప్రేమ్ చంద్రారెడ్డి, రావత్, అజేయ్ జైన్ వంటి వారికి సీఐడీ ఎందుకు విచారించ లేదని పట్టాభి ప్రశ్నించారు.
Read Also: Kalva Srinivasulu:రాయలసీమకు తీరని అన్యాయం చేసింది జగనే
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!