Pattabhi Ram: ఈడీ నోటీసులతో మాకేం భయం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక లావాదేవీలపై ఏ దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసినా.. ఈడీ దాని గురించి ఆరా తీస్తుందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం. .ఇందులో నిజానిజాలేంటని నిగ్గు తేల్చేందుకే ఈడీ నోటీసులిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఐడీ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈడీ నోటీసులతో మేమేం భయపడడం లేదన్నారు. నోటీసులు ఇచ్చిన వాళ్లు అక్కడికి వెళ్లి సమాధానం చెబుతారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఏం పీకింది..?ఏడాది నుంచి సీఐడీ ఏం గడ్డిపీకలేకపోయింది.. ఈడీ నోటీసులకు మేం భయపడతామా..? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Jagapathi Babu: రమ్, విస్కీ, బ్రాందీ, చెత్త చెదారం అన్ని ఇదే నాకు
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
చంద్రబాబు మీద.. ఘంటా సుబ్బారావు మీద ఆధారాలేం నిరూపించగలిగారు..?ఈడీ తాటాకు చప్పుళ్లకు.. నోటీసులకు మేం కంగారుపడం.మేమేమన్నా విజయసాయిరెడ్డిలా చంద్రబాబు, లోకేష్లు తమ ఫోన్లు పోయాయని ఫిర్యాదులు చేస్తారా..? మాకా ఖర్మ పట్టలేదు.స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా చాలా మందికి శిక్షణ ఇచ్చారు.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా చాలా మందికి ఉపాధి లభించింది.నిరుపేదలకు ఉపాధి లభిస్తోంటే సీఎం జగన్కు నచ్చడం లేదు.2020 మార్చి నాటికి 2.12 లక్షల మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లల్లో ట్రైనింగ్ ఇచ్చారన్నారు.
64 వేల మందికి ఉపాధి లభించిందన్నారు పట్టాభిరాం. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు నెలకొల్పిన చాలా కాలేజీలు గుడ్ కండిషన్లో పరికరాలు అందాయని సర్టిఫై చేశారు.గుడ్ కండిషన్లో పరికరాలు తీసుకున్నామని 2021 ఆగస్టులో కాలేజీల నుంచి లేఖలు వస్తే.. డిసెంబర్ 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..?అలాగే సీమెన్స్ సప్లై చేసిన పరికరాలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ టూల్ డిజైన్స్ సంస్థ సర్టిఫికెట్ ఇచ్చింది.ఒక్కొ క్లస్టర్కు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్న అంచనాను ఇంటెలిజెన్స్ ఆఫ్ టూల్ డిజైన్స్ సంస్థ నిర్ధారించింది.ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ప్రేమ్ చంద్రారెడ్డి, రావత్, అజేయ్ జైన్ వంటి వారికి సీఐడీ ఎందుకు విచారించ లేదని పట్టాభి ప్రశ్నించారు.
Read Also: Kalva Srinivasulu:రాయలసీమకు తీరని అన్యాయం చేసింది జగనే
తాజావార్తలు
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!