Julakanti Brahma Reddy: మా ఇళ్లను మేమే తగులబెట్టుకుంటామా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Julakanti Brahma Reddy: పల్నాడు జిల్లా మాచర్లలో పొలిటికల్ హీట్ నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పుపెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మాచర్ల టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. తమ ఇళ్లను తామే తగులబెట్టుకున్నామని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మాచర్ల మెయిన్ రోడ్డుపై ఉన్న షాపుల్లో కరపత్రాలు పంచుతున్నామని.. ఆ సమయంలో వైసీపీ నేతలు తమపై దాడులకు తెగబడ్డారని వెల్లడించారు. మాచర్లలో వైసీపీ అకృత్యాలకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ నేతలు కర్రలు పట్టుకుని నిలబడ్డారని.. రెండు గంటల పాటు కర్రలతో వైసీపీ నేతలు హల్చల్ చేసినా పోలీసులు చోద్యం చూస్తూనే ఉన్నారని విమర్శించారు.
Read Also: Varasudu: ‘వారసుడు’ను మహేశ్, చరణ్ వద్దన్నారా!?
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
మరోవైపు శాంతియుతంగా ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలపై వైసీపీ నేతలు రాళ్లు.. సోడా బుడ్లతో దాడి చేశారని.. టీడీపీ కార్యకర్తలు ఓపిక నశించి ప్రతిఘటించారని తెలిపారు. అప్పుడు పోలీసులు వచ్చి తమపై లాఠీఛార్జ్ చేశారన్నారు. లా అండ్ ఆర్డర్ తప్పుతుందని తనను బయటకు పంపారని.. నను బయటకు పంపే సమయంలో ఎస్కార్ట్ ఇవ్వలేదని.. తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారులు మాచర్ల వచ్చాకే వైసీపీ కార్యకర్తలు కార్లు తగులపెట్టారని.. ఇళ్లల్లో జొరబడి లూటీలు చేశారన్నారు. ఓ బీసీ నాయకుడు, ఓ ఎస్టీ నేత ఇంటి మీద వైసీపీ నేతలు దాడి చేశారని విమర్శలు చేశారు. శనివారం కూడా మాచర్లలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని.. సగం కాలిన ఆఫీసుపై మరోసారి దాడి చేసి క్యాష్ ఎత్తుకుపోయారని విమర్శించారు. ఎస్పీ స్వయంగా మాచర్లలో ఉండి పర్యవేక్షణ చేస్తున్నా ఇలా అరాచకాలు జరగడం ఏంటని జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!