Students Gang War: మత్స్యపురిలో స్టూడెంట్స్ మధ్య గ్యాంగ్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్ధుల మధ్య చిన్న చిన్న గొడవలు వివాదాలకు, దాడులకు కారణం అవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామం జడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థులు రేజర్ బ్లేడ్లు తో దాడిచేసి ఇద్దరు విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. ఒక విద్యార్థికి పొట్ట భాగం లోతుగా గాయం కాగా, మరో విద్యార్థి భుజం, చేతిపై గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే పాఠశాల ఉపాధ్యాయులు, అభివృద్ధి కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కొన్ని గంటల పాటు ఎవరికీ తెలియకుండా గోప్యత పాటించారని విద్యార్థులు వాపోతున్నారు.
స్థానికంగా వైద్యం చేయించి పోలీసు కేసులు లేకుండా రాజీ ప్రయత్నాలు చేశారు అక్కడి నాయకులు. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో స్కూల్ దగ్గరికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేస్తామని, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మత్స్యపురి హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. వీరిని విడదీయడానికి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరు అడ్డు వెళ్లగా వారిని బ్లేడుతో గాయపరిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమాధానం పలు అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి. తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు బెంచీలపై, కొంతమంది క్రింద కూర్చోవడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని అందువల్లే గొడవ జరిగిందని విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ చెబుతున్నారు. గొడవ పై నరసాపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!