Attack on Vande Bharat Train: విశాఖలో వందే భారత్ ట్రైన్పై రాళ్ల దాడి.. రంగంలోకి ఆర్పీఎఫ్
Attack on Vande Bharat Train: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీయబోతోంది. ఒకే రైలు రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ నడిపేందుకు సిద్ధమయ్యారు.. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో ప్రధాని తన పర్యటనను వాయిదా వేశారు.. అయితే, ఇండియన్ రైల్వేస్ 2019లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించింది.. క్రమంగా.. వివిధ రూట్లలో ఈ రైళ్లను పట్టాలెక్కిస్తోంది.. అయితే, విశాఖలో వందే భారత్ ట్రైన్ బోగీలపై రాళ్లదాడి జరిగింది.. కంచరపాలెంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. వందే భారత్ ట్రైన్పై రాళ్లు రువ్వారు.. ఈ ఘటనలో రెండు కోచ్ల అద్దాలు ధ్వంసం అయ్యినట్టు తెలుస్తోంది..
Read Also: Fire Accident in Sankranthi Celebrations: స్కూల్లో సంక్రాంతి సంబరాలు.. భోగి మంటల్లో అపశృతి
Also Read
ట్రయిల్ రన్లో భాగంగా చెన్నై నుండి విశాఖకు వచ్చింది వర్షన్ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్.. దీనిపై దాడికి పాల్పడ్డారు దుండగులు.. ఈ ఘటనతో అప్రమత్తం అయిన రైల్వే అధికారులు ఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు.. వందేభారత్ ట్రైన్ పై రాళ్లదాడి నిజమేనని చెబుతున్నారు వాల్తేర్ డివిజన్ అధికారులు.. కాగా, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో ప్రారంభం కానున్న వందే భారత్ ట్రైన్.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ ఎంట్రీతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం 8 గంటలకు తగ్గిపోనుంది. అయితే, ఆదిలేనే.. అది కూడా ప్రారంభానికి నోచుకోకముందే.. రైలుపై రాళ్ల దాడి జరగడంతో అప్రమత్తం అయిన రైల్వే పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు..
తాజావార్తలు
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
-
ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!