Attack on Vande Bharat Train: విశాఖలో వందే భారత్ ట్రైన్పై రాళ్ల దాడి.. రంగంలోకి ఆర్పీఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on Vande Bharat Train: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీయబోతోంది. ఒకే రైలు రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ నడిపేందుకు సిద్ధమయ్యారు.. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో ప్రధాని తన పర్యటనను వాయిదా వేశారు.. అయితే, ఇండియన్ రైల్వేస్ 2019లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించింది.. క్రమంగా.. వివిధ రూట్లలో ఈ రైళ్లను పట్టాలెక్కిస్తోంది.. అయితే, విశాఖలో వందే భారత్ ట్రైన్ బోగీలపై రాళ్లదాడి జరిగింది.. కంచరపాలెంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. వందే భారత్ ట్రైన్పై రాళ్లు రువ్వారు.. ఈ ఘటనలో రెండు కోచ్ల అద్దాలు ధ్వంసం అయ్యినట్టు తెలుస్తోంది..
Read Also: Fire Accident in Sankranthi Celebrations: స్కూల్లో సంక్రాంతి సంబరాలు.. భోగి మంటల్లో అపశృతి
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రయిల్ రన్లో భాగంగా చెన్నై నుండి విశాఖకు వచ్చింది వర్షన్ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్.. దీనిపై దాడికి పాల్పడ్డారు దుండగులు.. ఈ ఘటనతో అప్రమత్తం అయిన రైల్వే అధికారులు ఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు.. వందేభారత్ ట్రైన్ పై రాళ్లదాడి నిజమేనని చెబుతున్నారు వాల్తేర్ డివిజన్ అధికారులు.. కాగా, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో ప్రారంభం కానున్న వందే భారత్ ట్రైన్.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ ఎంట్రీతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం 8 గంటలకు తగ్గిపోనుంది. అయితే, ఆదిలేనే.. అది కూడా ప్రారంభానికి నోచుకోకముందే.. రైలుపై రాళ్ల దాడి జరగడంతో అప్రమత్తం అయిన రైల్వే పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!