శ్రీరామనవమి వచ్చిందంటే భద్రాచలంలో సందడే సందడి.. రెండు తెలుగు రాష్ట్రాల చూపు భద్రాచలం వైపు పడుతుంది. కడు రమణీయంగా రాముడి కల్యాణం అక్కడ జరుగుతుంది. ఆ కల్యాణం కమనీయం చూడాలంటే రెండు కళ్ళు చాలవంటే అతిశయం కాదు. లక్షలాదిమంది శ్రీరాముడి కల్యాణం చూడడానికి భద్రాద్రి వెళతారు.. భద్రాచలం రామాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా వనిత టీవీ స్పెషల్ సాంగ్ విడుదల చేసింది. అలిగి కూర్చున్నాది.. అలిగి కూర్చున్నాది… ఆమె ఎవ్వారో .. బంగారు కడియాల.. రింగు వెంట్రుకాల రంగు సీతమ్మో… అంటూ స్పెషల్ సాంగ్ సాగుతుంది. రామయ్యా సీతమ్మ.. పోయేనే సీతమ్మ.. తోట లోపలికి.. ముత్యాల పైట కొంగు… ముత్యాల పైట కొంగు.. పౌడాల పైట కొంగు అంటూ జానపదాల పడికట్టులతో ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది.