Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా బాధిత ప్రాంతాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 నెలలుగా టీడీపీ పాలనలో ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేశారు.. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు శాపంలా మారాయి.. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వాలనుకున్నాం.. ప్రైవేటీకరణతో ఒక ప్రభుత్వ ఆలోచనలు తొక్కేశారు.. కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదన్నారు. బలగ ప్రాంతంలో డయేరియా డిసెంబర్ లో ఇలానే వచ్చింది.. 100 మందికి పైగా డయేరియా పేషెంట్లు ఉన్నారు.. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటించుకుంటారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మడిపడ్డారు.
Read Also: Neena Gupta: పెళ్లి కాకుండానే..ఆ క్రికెటర్తో బిడ్డను కన్నాను.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Gunda Appala Suryanarayana Passes Away: కాలుజారి పడిపోయిన మాజీ మంత్రి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
అయితే, అతిసారంతో నలుగురు చనిపోతే ఒకరు లేదా ఇద్దరే చనిపోయారంటున్నారు.. వాంతులు, విరోచనాలతో ప్రజలు చనిపోతుంటే పోస్టుమార్టం అంటున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. కుటుంబాలను ఆదుకుందామనే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదన్నారు. బాధ్యత లేకుండా రాజధాని పేరుతో డబ్బును ఒకే దగ్గర పెడుతున్నారని విమర్శించారు. అన్ని రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.. యూరియా బస్తా కోసం రైతు వెళ్తే యూరియా బస్తా లేదు.. ఇంగ్లీషు మీడియం చదువుకుంటాననే విద్యార్థికి విద్య లేదు.. ధాన్యానికి కనీస మద్దతు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రెండు కేజీ లు ఎక్కువ తీసుకుంటున్న పట్టించుకోలేదని ప్రసాద్ రావు చెప్పారు.
Read Also: AJITH KUMAR : డైరెక్టర్స్ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్
ఇక, నదుల్లో సిల్ట్ క్లియర్ చేయాల్సిన ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో తీస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన అన్నారు. దోపిడి, నిర్లక్ష్యంతో పాలన చేస్తున్నారని విమర్శించారు. మున్సిపాలిటీని ప్రైవేట్ ఏజెన్సీల తయారు చేశారు.. ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్ని ప్రాంతాల ప్రజల్లో వచ్చింది.. ఇచ్చిన హామీల కోసం రూ. 1000 కోట్ల అయినా శ్రీకాకుళంలో ఖర్చు చేశారా అని క్వశ్చన్ చేశారు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని బొందా పెట్టే రోజు దగ్గర లోనే ఉందని ప్రసాద్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!