Duvvada Srinivas: వైసీపీ సస్పెన్షన్ వేటుపై ఎమ్మెల్సీ దువ్వాడ ఫస్ట్ రియాక్షన్.. ధన్యవాదాలు..!
- తనపై సస్పెన్షన్ వేటుపై తొలిసారి స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ..
- నా ఈ స్థాయికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డియే..
- హోదా , గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు..
- పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసాను.. పార్టీ గొంతే మాట్లాడాను..
- అకారణంగా వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేశారని ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Srinivas: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఆ పార్టీ.. వైసీపీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే.. ఆయనపై వేటు పడినట్టుగా తెలుస్తోంది.. అయితే, తనపై సస్పెన్షన్ వేటు విషయంపై తొలిసారి స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. కీలక వ్యాఖ్యలు చేశారు..
Read Also: Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ కుదేల్
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
నా ఈ స్థాయి కారణం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డియే అంటూ ఓ వీడియో విడుదల చేశారు దువ్వాడ శ్రీనివాస్.. హోదా , గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న ఆయన.. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసాను.. పార్టీ గొంతే మాట్లాడాను.. ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డాను.. ఎంతో కష్టపడి పనిచేసిన నాకు, అకారణంగా వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేసినట్లు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, రాజకీయ క్రీడలో నేను బలి అయ్యా నేమో అనిపిస్తుందన్నారు.. ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు..
Read Also: Addanki Dayakar: బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు?
సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామం మాత్రమే అన్నారు దువ్వాడ.. స్వతంత్రుడిగా నా ప్రజల కోసం పనిచేస్తాను అన్నారు.. మరింత రెట్టింపు ఉత్సాహంతో అభిమానుల కోసం పనిచేస్తాను.. ప్రతి ఊరు ప్రతి ఇంటికి వస్తాను.. అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుందన్నారు.. టెక్కలి నియోజకవర్గం ప్రజలను తాను ఎప్పుడు మర్చిపోను అన్నారు.. నా ఊపిరి ఉన్నంతవరకు నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షంగా పనిచేస్తాను అని ప్రకటించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్..
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!