Duvvada Vani vs Divvala Madhuri: కోర్టు ఆర్డర్ వచ్చింది.. నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిచిపెట్టను..
- ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ప్రధాన ద్వారం వద్ద వాణి.. హైందవి ఆందోళన..
- నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిపెట్టేది లేదు..
- కేసు కోర్టులో ఉంది.. మాకు ఆర్డర్ కూడా వచ్చింది..
- ఇంటిలో ప్రవేశానికి కోర్టు నాకు అనుమతి ఇచ్చిందన్న వాణి..
- ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Vani vs Divvala Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం కాస్తా రచ్చకెక్కింది.. ఈ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటూనే ఉంది.. గత నెల రోజులుగా దువ్వాడ వాణి.. కామార్తె హైందవి.. వివాదాస్పదంగా మారిన ఇంటి ముందు ఆందోళన కొనసాగిస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు దివ్వెల మాధురి.. ఆ ఇంట్లో ప్రత్యక్షం కావడంతో.. మరోసారి దువ్వాడ వ్యవహారం చర్చగా మారింది.. అయితే.. నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిపెట్టేది లేదంటున్నారు దువ్వాడ వాణి.. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్నారు వాణి, కుమార్తె హైందవి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వాణి.. కేసు కోర్టులో ఉంది.. మాకు ఆర్డర్ కూడా వచ్చింది.. ఇంటిలో ప్రవేశానికి కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు.. కోర్టు ఆదేశాలు ఉండగా.. మాధురి చేసుకున్న రిజిస్ట్రేషన్ చెల్లదు అంటున్నారు.. ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందంటున్నారు.. ఇక, మా ఆస్తి తీసుకొని, రకరకాల ఇల్లీగల్ పనులు చేస్తుంది అంటూ దివ్వెల మాధురిపై మండిపడ్డారు.
Read Also: Duleep Trophy: 7 వికెట్లు, 7 మెయిడిన్లు.. విరుచుకుపడ్డ బౌలర్, ఇంతకీ ఎవరు..?
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
నా ఆస్తి ఐదున్నర ఎకరాలు అమ్మి ఇల్లు కొన్నాం.. నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిచిపెట్టను అంటున్నారు దువ్వాడ వాణి.. నా పలాస ఆస్తి అమ్మి కొన్న ఇల్లు ఇది.. బగవంతుడు ఉన్నాడు.. మోసం చేయడు.. పిల్లలకు ఇల్లు చెందుతుందని బావిస్తున్నాను అన్నారు. మరోవైపు పోలీసుల రక్షణ అడుగుతున్నాం.. పొలీసుల సహకారంతోనే ఆ ఇంట్లోకి అడుగుపెడతాను అన్నారు.. ఇక, నా భర్త నన్ను మోసం చేస్తాడని భావించలేదు.. నా పిల్లలకు చీట్ చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పితృఅర్జితం ఒక్క రూపాయి రాలేదు.. మా అస్తులు అమ్మి సంపాదించిన ప్రాపర్టీ ఇది అన్నారు.. నా పిల్లల కోసం ఒక ఇంటిలోనే ఉండాలని కోరుకున్నానని తెలిపారు దువ్వాడ వాణి..
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!