Atchannaidu: మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే.. అదే మీకు చివరి రోజు
- మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక ఐదు కోట్ల మందికి స్వాతంత్ర్యం వచ్చింది- మంత్రి
- గత ఐదేళ్లు ఎవరిని వదలలేదు.. కేసులు పెట్టారు- అచ్చెన్నాయుడు
- తప్పు చేసిన వారిని లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం- మంత్రి
- చంద్రబాబు.. పవన్ కుటుంబం పై ఇష్టానుసారం పోస్ట్ చేస్తున్నారు- మంత్రి
- మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే అది చివరి రోజు- అచ్చెన్నాయుడు.
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న వ్యవసాయ, పశుసంవర్దక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదు కోట్ల మందికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. గత ఐదేళ్లు ఎవరిని వదలలేదు.. కేసులు పెట్టారు.. ఆస్తుల ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని వైసీపీపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై కూడా ప్రజలనుండి అదే ఒత్తిడి ఉంది.. తమ నేత చంద్రబాబు కక్ష్య సాధింపుకి దూరం అని అన్నారు. ఐదు నెలలు ప్రజా స్వామ్యంగా పరిపాలన చేస్తున్నాం.. తప్పు చేసిన వారిని లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ కుటుంబంపై ఇష్టానుసారం పోస్ట్ చేస్తున్నారు.. పవన్ తన ఆడపిల్లలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని.. క్యాబినెట్ భేటీలో బాధపడ్డారని అచ్చెన్న వెల్లడించారు
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
దొంగే దొంగ అన్నట్లుగా జగన్ గొంతు చించుకుని అరుస్తున్నారు.. జగన్ నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని దుయ్యబట్టారు. పోస్టులు పెట్టిందని ముసలావిడను కూడా వదల్లేదని మంత్రి ఆరోపించారు. ఈ రోజు భావ ప్రకటనా స్వేచ్ఛా గుర్తోచ్చిందా.. జగన్ అని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో.. ఆడపిల్లలపై ఇష్టానుసారం పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మనిచ్చిన సొంత తల్లి, చెల్లి మీద సోషల్ మీడియాలో పెడుతున్నావంటూ ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు. మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే.. అదే మీకు చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున హెచ్చరిస్తున్నా.. మహిళలపై ఏ పార్టీ వారైనా అసహ్య పోస్టులు పెడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
AP High Court: హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..
కూటమి అంతా హ్యాపీగా ఉంది.. కలిసే ఉంటున్నాం.. లోపాలు ఉంటే చర్చించుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2027లో అధికారంలోకి వస్తా అంటూ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. మరోవైపు.. తాము 21 మందే గెలిచాం.. అధికారం ముఖ్యం కాదని అసెంబ్లీకి వెళ్లాం.. సమస్యలపై పోరాడాం.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్లవా అంటూ ప్రశ్నించారు.
ఎవరడిగితే వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా.. దానికి పద్దతి ఉంది కదా అని అన్నారు. నీవు అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రం, ప్రజల కోసం అసలు పట్టింపు లేదని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!