Nellore Murder Case: బాధితులను ఆదుకుంటాం.. శవ రాజకీయాలు చేయొద్దు..
- రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నెల్లూరు హత్య కేసు..
- బాధిత కుటుంబాలను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత..
- బాధితులను ఆదుకుంటాం.. శవ రాజకీయాలు చేయొద్దు: మంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Murder Case: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీన జరిగిన ఘటన దారుణం, దురదృష్టకరం.. డబ్బులు అడిగే విషయంలో బ్రూటల్ గా హత్య చేశాడు.. ఈ కేసులో నిందితుడు హరి చంద్రప్రసాద్ ను అతని తండ్రిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపటం జరిగింది.. బాధిత మహిళకు, అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది.. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది.. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యాబిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది.
Read Also: Bhatti Vikramarka : విద్యపై రాజీ లేదు…అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
ఇక, మీకు దండం పెడతాం.. ఈ హత్య కేసును రాజకీయం చేయొద్దు అని మంత్రి అనిత కోరింది. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామన్నారు. హత్య జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించాలి.. అందుకే అరెస్టు చేయటం ఆలస్యం అయ్యింది.. బాధితురాలిని ఆదుకునే విషయం పక్కనపెట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడింది. క్రిమినల్స్ కు కులం మతం ఉండదు.. క్రిమినల్ ను క్రిమినల్ గానే చూస్తామన్నారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.. మేము నివేదిక ఇస్తున్నాం.. నివేదిక ప్రకారం ప్రభుత్వం సాయం చేస్తుందని వంగలపూడి అనిత వెల్లడించింది.
తాజావార్తలు
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!