Kakani Govardhan Reddy: సోషల్ మీడియాలో జగన్పై అనుచిత పోస్టులు.. పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు
- వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు..
- చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు..
- టీడీపీపై మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనం అరుణమ్మ, రూరల్ ఇంచార్జి విజయ్ కుమార్ రెడ్డి.. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పై సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు అనుచిత పోస్టులు పెడుతున్నారు.. వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. టీడీపీ నేతలు జగన్ పై అనుచిత పోస్ట్ లు పెట్టారు.. వాళ్ల వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాం అన్నారు.
Read Also: IPL 2025 Auction: ఆర్ అశ్విన్కు రూ.8.5 కోట్లు.. ఏ జట్టు తీసుకుందంటే?
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ఇక, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు కాకాణి.. రాజ్యాంగం అందరికీ ఒక్కటే.. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్లే.. టీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదు.. సోమిరెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ దళితుని ఆవేదనను వాట్సప్ లో షేర్ చేస్తే.. నా మీద కేసులు పెట్టారు.. రేపు అనేది ఉందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ నేతలే ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి.. వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారని.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. అన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటాం అని వ్యాఖ్యానించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!