Kakani Govardhan Reddy: సోషల్ మీడియాలో జగన్పై అనుచిత పోస్టులు.. పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు
- వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు..
- చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు..
- టీడీపీపై మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనం అరుణమ్మ, రూరల్ ఇంచార్జి విజయ్ కుమార్ రెడ్డి.. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పై సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు అనుచిత పోస్టులు పెడుతున్నారు.. వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. టీడీపీ నేతలు జగన్ పై అనుచిత పోస్ట్ లు పెట్టారు.. వాళ్ల వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాం అన్నారు.
Read Also: IPL 2025 Auction: ఆర్ అశ్విన్కు రూ.8.5 కోట్లు.. ఏ జట్టు తీసుకుందంటే?
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
ఇక, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు కాకాణి.. రాజ్యాంగం అందరికీ ఒక్కటే.. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్లే.. టీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదు.. సోమిరెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ దళితుని ఆవేదనను వాట్సప్ లో షేర్ చేస్తే.. నా మీద కేసులు పెట్టారు.. రేపు అనేది ఉందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ నేతలే ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి.. వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారని.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. అన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటాం అని వ్యాఖ్యానించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!