Deputy CM Pawan Kalyan: గొప్ప మనసు చాటుకున్న పవన్.. ఉగ్రదాడి అమరుని కుటుంబానికి రూ.50 లక్షల విరాళం..
- మరోసారి గొప్ప మనసు చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- ఉగ్రదాడిలో అమరుడైన మధుసూదన్ కుంటుంబానికి అండగా జనసేన..
- జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించిన జనసేనాని..
- మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుంటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.. ఇక, మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో పహల్గామ్ అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసేన.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భారత్ దేశంలో ఉంటూ పాకిస్థాన్ను ప్రేమిస్తాం అంటారు.. వీళ్లంతా కాంగ్రెస్ నాయకలు.. కొందరు ఎమ్మెల్సీలు కూడా వున్నట్టు వున్నారు.. అంతలా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే భారత్ను వదిలి పాకిస్థాన్ వెళ్లిపోండి అని సూచించారు.. జనసేన ఏపీ, తెలంగాణలో ఉంది.. కానీ, జనసేన విధానం జాతీయ వాదం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు..
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
ఇక, మత ప్రాతిపదికన హత్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం అన్నారు జనసేనాని.. తప్పులు చేసినవారిని రక్షిస్తూ వైట్ వాష్ చేయవద్దన్న ఆయన.. పాకిస్థాన్ జనాభాకు సమానంగా భారత్లో ముస్లింలు ఉన్నారు.. కానీ, భారతదేశంలో మత వివక్షకు చోటులేదని స్పష్టం చేశారు.. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశం.. ఇక్కడే చంపేస్తే ఎక్కడికి పోవాలి..? అని ప్రశ్నించారు.. క్లిష్ట సమయంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది.. ఉగ్రవాద నిర్మూలనపై రాజకీయాలకంటే దేశ భద్రత ముందని పిలుపునిచ్చారు.. ఓట్ల కోసమే కాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం అవసరం అన్నారు పవన్.. దేశంలో ఎక్కడ ఏం జరిగినా, దేశం మొత్తం దాని ప్రభావం ఉంటుంది.. సరిహద్దు మేనేజ్మెంట్ చాలా క్లిష్టమైన పని.. సరిహద్దులు కాపాడుకోకపోతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి అన్నారు పవన్ కల్యాణ్.. ఉగ్రవాదాలను పూర్తిగా నాశనం చేయాలన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: AP BJP: అమరావతి పర్యటనకు ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ స్పెషల్ ఫోకస్..!
కాగా, బెంగళూరులో స్థిరపడిన నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్.. ఈనెల 22న పహల్గామ్లో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లగా.. ఉగ్రవాదులు కాల్చి చంపారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్కు చెందిన మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. మధుసూదన్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!