Anam Venkata Ramana Reddy: నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్ది కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్ది బ్రోకర్, ఆర్ధిక ఉగ్రవాది అని విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి.. అందుకే జైలుకి వెళ్లారని ఆరోపించారు. సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజలు నమ్మరు.. వారి చెవ్వుల్లో పువ్వులు లేవని వ్యాఖ్యానించారు. వేణుంబాక ఫౌండేషన్ 13 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. విజయసాయి రెడ్ది సేవ చేశానని చెప్పడం అబద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prakash Raj:ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు… వైరల్ అవుతున్న వీడియో..!
Also Read
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సొంత నిధులు ఖర్చు చేసిన ఆధారాలు ఉన్నాయని ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఎంపీ ల్యాండ్స్ కింద సాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో పదేళ్లలో రూపాయి అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్డి కాదన్నారాయన. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా విద్య, వైద్యం, తాగు నీరు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. రూ. 2.16 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రికి క్యాన్సర్ వైద్యం కోసం వాహనం కొనిచ్చాడు.. శ్రీశైలం ఆలయానికి రూ. 11 కోట్లతో బంగారు రథం బహుకరించిన సేవా మూర్తి వీపీఆర్ అని కొనియాడారు. చర్చి, మసీదు, ఆలయాలకు ఆర్ధిక సహయం చేస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Geomagnetic Storm: భూమిని తాకిన “సౌరతుఫాన్”.. 6 ఏళ్లలోనే అతిపెద్దది..
అదాన్ డిస్టలిరీస్ కంపెనీకి జగన్ లాబీ చేయలేదా అని ఆనం వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. సాయి రెడ్ది మద్యం కంపెనీతో ఎందరో తాళి బొట్లు తెగాయి.. నవంబర్ 2022లో శరత్ చంద్రా రెడ్డిని ఇరికించిన మాట వాస్తవం కాదా అని పేర్కొన్నారు. సాయి రెడ్డి దొంగ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఛార్టర్డ్ అకౌంట్స్ వాళ్లే చెప్పారు.. సాయిరెడ్డి ఛార్టర్డ్ అకౌంట్ గా ఉండేందుకు అర్హుడు కాదనివాళ్లే తేల్చి చెప్పారన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడుకి ఎందుకు శుభాకాంక్షలు పెట్టావు.. అక్కడ సాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అని తెలిపారు. విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్ ను కమ్మ సామాజిక వర్గానికి అంటగట్టారు.. జగన్ తో జైల్లో ఉన్న వాళ్లు అందరు నెల్లూరు వాళ్లేనని ఆనం వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!