Anam Venkata Ramana Reddy: నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్ది కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్ది బ్రోకర్, ఆర్ధిక ఉగ్రవాది అని విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి.. అందుకే జైలుకి వెళ్లారని ఆరోపించారు. సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజలు నమ్మరు.. వారి చెవ్వుల్లో పువ్వులు లేవని వ్యాఖ్యానించారు. వేణుంబాక ఫౌండేషన్ 13 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. విజయసాయి రెడ్ది సేవ చేశానని చెప్పడం అబద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prakash Raj:ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు… వైరల్ అవుతున్న వీడియో..!
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సొంత నిధులు ఖర్చు చేసిన ఆధారాలు ఉన్నాయని ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఎంపీ ల్యాండ్స్ కింద సాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో పదేళ్లలో రూపాయి అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్డి కాదన్నారాయన. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా విద్య, వైద్యం, తాగు నీరు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. రూ. 2.16 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రికి క్యాన్సర్ వైద్యం కోసం వాహనం కొనిచ్చాడు.. శ్రీశైలం ఆలయానికి రూ. 11 కోట్లతో బంగారు రథం బహుకరించిన సేవా మూర్తి వీపీఆర్ అని కొనియాడారు. చర్చి, మసీదు, ఆలయాలకు ఆర్ధిక సహయం చేస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Geomagnetic Storm: భూమిని తాకిన “సౌరతుఫాన్”.. 6 ఏళ్లలోనే అతిపెద్దది..
అదాన్ డిస్టలిరీస్ కంపెనీకి జగన్ లాబీ చేయలేదా అని ఆనం వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. సాయి రెడ్ది మద్యం కంపెనీతో ఎందరో తాళి బొట్లు తెగాయి.. నవంబర్ 2022లో శరత్ చంద్రా రెడ్డిని ఇరికించిన మాట వాస్తవం కాదా అని పేర్కొన్నారు. సాయి రెడ్డి దొంగ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఛార్టర్డ్ అకౌంట్స్ వాళ్లే చెప్పారు.. సాయిరెడ్డి ఛార్టర్డ్ అకౌంట్ గా ఉండేందుకు అర్హుడు కాదనివాళ్లే తేల్చి చెప్పారన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడుకి ఎందుకు శుభాకాంక్షలు పెట్టావు.. అక్కడ సాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అని తెలిపారు. విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్ ను కమ్మ సామాజిక వర్గానికి అంటగట్టారు.. జగన్ తో జైల్లో ఉన్న వాళ్లు అందరు నెల్లూరు వాళ్లేనని ఆనం వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!