Anam Venkata Ramana Reddy: నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్ది కాదు
వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్ది బ్రోకర్, ఆర్ధిక ఉగ్రవాది అని విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి.. అందుకే జైలుకి వెళ్లారని ఆరోపించారు. సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజలు నమ్మరు.. వారి చెవ్వుల్లో పువ్వులు లేవని వ్యాఖ్యానించారు. వేణుంబాక ఫౌండేషన్ 13 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. విజయసాయి రెడ్ది సేవ చేశానని చెప్పడం అబద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prakash Raj:ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు… వైరల్ అవుతున్న వీడియో..!
Also Read
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సొంత నిధులు ఖర్చు చేసిన ఆధారాలు ఉన్నాయని ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఎంపీ ల్యాండ్స్ కింద సాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో పదేళ్లలో రూపాయి అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్డి కాదన్నారాయన. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా విద్య, వైద్యం, తాగు నీరు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. రూ. 2.16 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రికి క్యాన్సర్ వైద్యం కోసం వాహనం కొనిచ్చాడు.. శ్రీశైలం ఆలయానికి రూ. 11 కోట్లతో బంగారు రథం బహుకరించిన సేవా మూర్తి వీపీఆర్ అని కొనియాడారు. చర్చి, మసీదు, ఆలయాలకు ఆర్ధిక సహయం చేస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Geomagnetic Storm: భూమిని తాకిన “సౌరతుఫాన్”.. 6 ఏళ్లలోనే అతిపెద్దది..
అదాన్ డిస్టలిరీస్ కంపెనీకి జగన్ లాబీ చేయలేదా అని ఆనం వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. సాయి రెడ్ది మద్యం కంపెనీతో ఎందరో తాళి బొట్లు తెగాయి.. నవంబర్ 2022లో శరత్ చంద్రా రెడ్డిని ఇరికించిన మాట వాస్తవం కాదా అని పేర్కొన్నారు. సాయి రెడ్డి దొంగ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఛార్టర్డ్ అకౌంట్స్ వాళ్లే చెప్పారు.. సాయిరెడ్డి ఛార్టర్డ్ అకౌంట్ గా ఉండేందుకు అర్హుడు కాదనివాళ్లే తేల్చి చెప్పారన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడుకి ఎందుకు శుభాకాంక్షలు పెట్టావు.. అక్కడ సాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అని తెలిపారు. విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్ ను కమ్మ సామాజిక వర్గానికి అంటగట్టారు.. జగన్ తో జైల్లో ఉన్న వాళ్లు అందరు నెల్లూరు వాళ్లేనని ఆనం వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!