Speaker Tammineni: రాబోయే ఎన్నికల్లో టీడీపీ పూర్తి సమాధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంద్రప్రదేశ్లో రోజురోజుకి రాజకీయ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. పొత్తు, ప్రశ్నాపత్రాల వివాదం, ఎన్నికల వ్యూహాలు.. వంటి అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ను స్టార్ హోటల్గా మార్చుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు హైదరాబాద్ వదిలి ఏపీకి రారని అన్నారు.
గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి చంద్రబాబు ఇంకా కోలుకోలేదని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా సమాధి కాబోతోందని తమ్మినేని జోస్యం చెప్పారు. చంద్రబాబు చేస్తోన్న యాత్రలు.. అసమర్థుడి ఆఖరి అంతిమయాత్రలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా పోరాడే దమ్ము లేకపోవడం వల్ల పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని, అయితే తమ సింహం (జగన్) మాత్రం సింగిల్గానే వస్తుందని తెలిపారు. తమ పార్టీ క్యాడర్లో ఎక్కడా అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.
Also Read
ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం చేపట్టబోతున్నామని, తమలో ఏమైనా లోపాలుంటే సరిచేసుకుంటామని తమ్మినేని అన్నారు. అర్హత కలిగిన వారికి పథకాలు అందకపోతే, ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమం అందేలా చూస్తామన్నారు. ప్రతిపక్షాలు అపోహాలు సృష్టిస్తున్నాయని, ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన సంక్షేమ పథకాల్ని టంచన్గా అందిస్తున్నామని స్పీకర్ తమ్మినేని వెల్లడించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..