శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన సూచన.. ఇవాళ్టి నుండి ఈనెల 23వ తేదీ వరకు శ్రీశైలం మల్లన్న స్పర్శదర్శనం నిలిపివేస్తున్నట్టు ప్రటించారు శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో లవన్న… కార్తీకమాసం భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి స్పర్శదర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది దేవస్థానం… భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆర్జిత సేవ, స్పర్శదర్శనాలు నిలివేస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుందని ఈవో లవన్న వెల్లడించారు… అయితే, ముందస్తుగా ఆన్లైన్లో టికెట్ తీసుకున్న భక్తులకు మాత్రం రేపు స్పర్శదర్శనం, గర్భాలయ అభిషేకాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.. ఇప్పటికే గర్భాలయా అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలిపివేసింది దేవస్థానం.. కార్తీకమాసం ముగిసే వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు ఈవో లవన్న.. కాగా, కార్తీక మాసంలో శ్రీశైలం దేవస్థానానికి పోటెత్తుతున్నారు భక్తులు.. స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చిన భక్తులతో శ్రీశైలం గిరులు కిటకిటలాడుతున్నాయి. దీంతో, స్పర్శదర్శనం నిలిపివేసింది శ్రీశైలం దేవస్థానం.
Read Also: Chandrababu Naidu: గులకరాళ్లు వేస్తే పారిపోయే వ్యక్తిని కాను