Somu Veerraju : మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తావన లేదు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదు.
మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇది. బడ్జెట్ ను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తుంది. పెయిడ్ ప్రభుత్వ వ్యవస్థ ఏపీలో త్వరలో తీసుకు వస్తాం. మాకు శక్తి కేంద్రాలు ఉన్నాయి…ఈ ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్ధ ఉంది. పంజాబ్ లో మేము మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పంజాబ్ లో బీజేపీ గెలుస్తుంది. స్పెషల్ స్టేటస్ కన్న మనమే ఎక్కువ సాధించాం..అని అప్పట్లో చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు 5వేల కోట్లు అంచనా ఉండగా నేడు 5వేల కోట్లకు చేరింది.
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అప్పులతోనే పాలన సాగిస్తుంది. అప్పుల వివరాలు ఎన్నిసార్లు అడుగుతున్నా స్పందించడం లేదు. అప్పులు వివరాలు ప్రజల ముందు పెట్టాలి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ ఎక్కడా అమలు చేయడం లేదు. పెండింగ్ ప్రాజెక్టులకు వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించలేదన్నారు సోము వీర్రాజు. ఈ బడ్జెట్ లో రాజమండ్రి, కాకినాడ పేరు ఉందా? మరే జిల్లా పేరైనా ఉందా?కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాష్ట్రం ప్రస్తావన ఏదని అడిగిన జగన్ ఇక్కడ ఏ ప్రాంతం ప్రస్తావన ఎందుకు చూపలేదని ప్రశ్నించారు సోము వీర్రాజు. కేంద్ర బడ్జెట్ లో అందరికి నిధులు ఇచ్చాం. నరేంద్ర మోడీ కేంద్రంలో 64వేల కోట్లతో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పులు పెట్టిన జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్టు. అప్పులు ఎగ్గొట్టడానికా? ఏపీలో బీజేపీ జెండా ఎగరేస్తాం. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సముచిత స్థానం ఇచ్చాం. రైల్వే జోన్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని త్వరలోనే సాధ్యం చేస్తాం అన్నారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!