Somu Veerraju : మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తావన లేదు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదు.
మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇది. బడ్జెట్ ను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తుంది. పెయిడ్ ప్రభుత్వ వ్యవస్థ ఏపీలో త్వరలో తీసుకు వస్తాం. మాకు శక్తి కేంద్రాలు ఉన్నాయి…ఈ ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్ధ ఉంది. పంజాబ్ లో మేము మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పంజాబ్ లో బీజేపీ గెలుస్తుంది. స్పెషల్ స్టేటస్ కన్న మనమే ఎక్కువ సాధించాం..అని అప్పట్లో చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు 5వేల కోట్లు అంచనా ఉండగా నేడు 5వేల కోట్లకు చేరింది.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అప్పులతోనే పాలన సాగిస్తుంది. అప్పుల వివరాలు ఎన్నిసార్లు అడుగుతున్నా స్పందించడం లేదు. అప్పులు వివరాలు ప్రజల ముందు పెట్టాలి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ ఎక్కడా అమలు చేయడం లేదు. పెండింగ్ ప్రాజెక్టులకు వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించలేదన్నారు సోము వీర్రాజు. ఈ బడ్జెట్ లో రాజమండ్రి, కాకినాడ పేరు ఉందా? మరే జిల్లా పేరైనా ఉందా?కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాష్ట్రం ప్రస్తావన ఏదని అడిగిన జగన్ ఇక్కడ ఏ ప్రాంతం ప్రస్తావన ఎందుకు చూపలేదని ప్రశ్నించారు సోము వీర్రాజు. కేంద్ర బడ్జెట్ లో అందరికి నిధులు ఇచ్చాం. నరేంద్ర మోడీ కేంద్రంలో 64వేల కోట్లతో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పులు పెట్టిన జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్టు. అప్పులు ఎగ్గొట్టడానికా? ఏపీలో బీజేపీ జెండా ఎగరేస్తాం. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సముచిత స్థానం ఇచ్చాం. రైల్వే జోన్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని త్వరలోనే సాధ్యం చేస్తాం అన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!