Sankranti 2023: పల్లె బాట పట్టిన పట్నం.. అదనపు ఛార్జీల మోత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti 2023: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రోజువారీ సర్వీసుల్లో సీట్లన్నీ నిండిపోయాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించినా..సీట్లు, బెర్త్లు దొరక్కపోవడంతో కుటుంబాలతో కలిసి వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి సుమారు 12 లక్షల మందికిపైగా సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో ముందస్తుగా వేలాది మంది సొంతూళ్లకు పయనం కావడంతో బస్సులన్నీ నిండుగా బయలుదేరివెళ్లాయి.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
సంక్రాంతి అసలు రద్దీ మంగళ, బుధవారం నుంచి ప్రారంభమవుతుందన్న అంచనాలతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే 3 వేల 500 బస్సులకు అదనంగా 4 వేల 233 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్టు టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీ సైతం రోజూ నడిపే 500 సర్వీసులకు తోడుగా మరో 1,850 బస్సులను ఏర్పాటు చేసింది. ఇక.. రోజూ 4 నుంచి 5 వేల బస్సులను నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు కసరత్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేస్తుండగా.. ప్రైవేట్ బస్సులు మాత్రం దర్జాగా రెండు-మూడింతల మేర చార్జీలు పెంచి వసూలు చేస్తున్నాయి. సంక్రాంతికి సొంతూరికి వెళ్లాలన్న కుతూహలంతో చాలా మంది ప్రయాణికులు రెండు, మూడింతల చార్జీలు చెల్లించి మరీ.. ప్రైవేట్ బస్సుల్లో వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. సొంత కార్లలో ఊరికి వెళ్లడానికి మధ్య తరగతి, ఐటీ ఉద్యోగ కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే అన్ని రూట్లు రద్దీగా మారిపోయాయి.
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!