Sankranthi Rush: సంక్రాంతికి రైళ్ళు, బస్సులు ఫుల్.. పండుగకు బాదుడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోడిపందాలు, పిండివంటలు.. బంధువుల సందడి.. ఇంటిలో కోలాహలం.. ఇవన్నీ మిగతా పండుగల కంటే సంక్రాంతికి ఎక్కువగా వుంటుంది. హైదరాబాద్ నగరం నుంచి లక్షలాదిమంది పల్లెబాట పడతారు.. సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. 120 రోజుల ముందే రైళ్లలో సీట్లు పూర్తయిపోయాయి. ఎక్కడా ఒక్క సీటు కూడా లభ్యం కావడం లేదు. పండుగకు సరిగ్గా నెలరోజుల సమయం ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో నడిచే రైళ్లలో బెర్తులు అప్పుడే ఫుల్ అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే అక్టోబర్ నెలలోనే REGRET అని లిస్ట్ వచ్చేసింది. వెయిటింగ్ లిస్ట్ కూడా లేదు.
Read Also: Jagdeep Dhankhar: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు.. ఈడీ రైడ్స్పై హితవు
Also Read
సంకాంత్రికి నగరం నుంచి సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారు ఏం చేయాలో పాలుపోవడం లేదు. త్రీటైర్, టూ టైర్ మొదలుకుని స్లీపర్, సెకండ్ సీటింగ్ వరకు అన్నింటిలో భారీ వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. దీంతో భార్య,పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామాలకు ఎలా వెళ్లాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల పరిధిలోని రోజుకు 278 రైళ్లు రాకపోకలు తిరుగుతుంటాయి.
వీటిలో సింహభాగం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళుతుంటాయి. ఇక్కడినుంచే 128 రైళ్లు నడుస్తుంటాయి. ఆయా రైళ్లలో ప్రతి రోజు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెండింతలవుతుంది. సంక్రాంతికి ముందురోజులయితే సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి నుంచి లక్షలాదిమంది సొంతూళ్ళకు వెళుతుంటారు. సంక్రాంతికి వారం ముందే స్వంతూళ్ళకు వెళ్ళి పండుగ ముగిసిన రెండు రోజుల తర్వాత తిరిగి నగరానికి చేరుకుంటారు. సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ళలో 250కి పైగా వెయిటింగ్ లిస్టు చూపిస్తుండడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బస్సుల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నగరం నుంచి ఏపీకి వెళ్లే బస్సుల్లోనూ సీట్లు దొరకడం లేదు. APSRTC, TSRTC బస్సుల్లోనే అదే పరిస్థితి కనిపిస్తోంది.
Read Also:Nirmala Sitharaman: గత మూడేళ్లలో రూ.6 లక్షల కోట్ల రుణాలు రద్దు
సాధారణంగా గ్రేటర్ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, తదితర ప్రాంతాలకు ప్రతిరోజు 1200 నుంచి 1300 వరకు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు నడుస్తుంటాయి. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ రోజుల్లో 3 వేల నుంచి 4 వేల వరకు నడుస్తాయి. సాధారణ రోజుల్లో కంటే ప్రైవేట్ బస్సుల్లో టికెట్ రేట్లు అదనం. సాధారణ రోజుల్లో హైదరాబాద్-విజయవాడకు నడిచే బస్సులో స్లీపర్ బెర్తుకు రూ.1,650 టికెట్ ధర ఉండగా సంక్రాంతి సమయంలో రూ.1800 నుంచి రూ.2 వేల వరకు తీసుకుంటారు. అయితే టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ బుకింగ్లు ముందుగా ముగుస్తుండటంతో చాలామంది ప్రైవేట్ కార్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో బుకింగ్లు ముగిశాయి. స్వంతంగా కార్లలో వెళ్లాలనుకునేవారికి కూడా నిరాశే ఎదురవుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ దొరకడంలేదు. దీంతో పండుగకు ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదంటున్నారు ఏపీ తెలంగాణ వాసులు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..