NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు..

Tirumala

Tirumala

Tirumala: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఇవాళ్టి (గురువారం) నుంచి శాస్త్రోక్తంగా స్టార్ట్ అయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారి పవిత్ర మండపంలోని యాగశాలకు తీసుకు వచ్చి హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు కొనసాగించారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారి విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు.

Read Also: PM Modi: నేషన్ ఫస్ట్.. నేడు మోడీ ప్రసంగంలో కీలక అంశాలు..

ఇక, వేద పండితులు పంచసూక్తాలను సుదీర్ఘంగా పఠించారు. ఆ తర్వాత మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేసేశారు. పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు అధికారులు రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆల‌య డిప్యూటీ ఈవో లోకనాథంతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.