Sai Krishna Case Updates: సాయికృష్ణ కస్టోడియల్ డె*త్ కేసు.. సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
- సాయికృష్ణ కస్టోడియల్ డె*త్ కేసు
- రోజురోజుకూ కీలక మలుపులు
- ఇప్పటికే అరెస్టైన హెడ్ కానిస్టేబుల్ అశోక్ పాత్రపై మరిన్ని ఆధారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పలు కీలక విషయాలను వెలికితీస్తోంది. ఇప్పటికే అరెస్టైన హెడ్ కానిస్టేబుల్ అశోక్ పాత్రపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్న అధికారులు, కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా విచారిస్తున్నారు.
హెడ్ కానిస్టేబుల్ అశోక్ కీలక పాత్ర?
సిట్ దర్యాప్తులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఘటన అనంతరం తనకు సన్నిహితంగా ఉండే ఎక్స్ట్రీమ్ జిమ్ నిర్వాహకుడు సుశాంత్కు ఒక మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు, పర్సు ఇచ్చి గోవాకు పంపించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అశోక్ ఇచ్చిన మొబైల్ ఎవరిది? గోవాలో సుశాంత్ ఎవరెవరితో మాట్లాడాడు? అనే అంశాలపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
Also Read
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
- AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
- AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
సుశాంత్ అదుపులోకి.. సోదరుడు పరారీలో?
ఈ కేసులో భాగంగా సుశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, అతని సోదరుడు ప్రమోద్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం కూడా దర్యాప్తులో కీలక అంశంగా మారింది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది విచారణ
దర్యాప్తు అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన మరో ముగ్గురు పోలీసు సిబ్బందిని కూడా పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. మే 10 తర్వాత సాయికృష్ణను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.
మెజిస్ట్రియల్ విచారణ అనంతరం తల్లి ఆవేదన
మెజిస్ట్రియల్ విచారణ ముగిసిన అనంతరం సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విచారణ సందర్భంగా అధికారులు కేసుకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారని ఆమె తెలిపారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారందరినీ గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందన
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా విజయలక్ష్మి స్పందించారు. తన కుమారుడు పవన్ కల్యాణ్కు అభిమానిగా ఉండేవాడని, పూర్తి నిజాలు తెలియకుండానే అతడిని నేరస్థుడిగా చిత్రీకరించడం బాధాకరమని అన్నారు. తాము కాపు సామాజిక వర్గానికి చెందిన వారమని, పవన్ కల్యాణ్ను నమ్మి ఓట్లు వేసి గెలిపించామని పేర్కొన్నారు.
మరికొందరి ప్రమేయంపై ఆరోపణలు
ఈ కేసులో ఇంకా పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని విజయలక్ష్మి ఆరోపించారు. తన కుమారుడిని ఇంటి నుంచి తీసుకెళ్లిన వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని ఆమె విమర్శించారు. వారందరినీ చట్టం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బూడిద అప్పగించాలని డిమాండ్
తన కుమారుడి బూడిదను తమ కుటుంబానికి అప్పగించాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బూడిద ఇవ్వకపోతే ఆత్మాహుతికి పాల్పడతానని హెచ్చరించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్న బూడిద నిజంగా తన కుమారుడిదేనని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు.
నిజాలు వెలుగులోకి రావాలని డిమాండ్
సాయికృష్ణ కేసులో పూర్తి నిజాలు బయటపడేలా నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని, ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా, సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
-
Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
-
Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!