YS Jagan: రాయలసీమ లిఫ్ట్ను ఆపించామని తెలంగాణ సీఎం అసెంబ్లీలో చెప్పారు.. చంద్రబాబు మాపై ఆరోపణలా..?
- రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వాస్తవాలు అందరికీ తెలియాలి..
- రాయలసీమ లిఫ్ట్ ను ఆపించామని తెలంగాణ సీఎం అసెంబ్లీలో ప్రకటించారు..
- రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ రెడ్డి చెప్పారు..
- స్వార్థ రాజకీయల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు, ఆయన ఇరిగేషన్ మంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది.. వీళ్లను చూస్తే రాక్షసులను తలపించేలా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ఏకంగా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మాటలు రైతన్నలకు విలన్ లాగా కనిపిస్తున్నారు.. క్లోజ్డ్ మీటింగ్ లో నేను ఒత్తిడి తెచ్చి పనులు ఆపించాను అనే దానికి రేవంత్ రెడ్డి మాటలు సాక్ష్యాలు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఖండిస్తారని అందరూ భావించారు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని వీళ్లు బరితెగించి మాట్లాడిన మాటలు వారి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్లేనని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also: TOXIC : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్
Also Read
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
ఇక, తన స్వార్ధం కోసం పిల్లను ఇచ్చిన మామని, జన్మనిచ్చిన సీమకు కూడా సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఒక గొప్ప ఉద్దేశ్యంతో ప్రారంభించాం.. తాగటానికి మంచి నీళ్లు కూడా దొరకని ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది.. రాయలసీమ, నెల్లూరు, చెన్నై ప్రాంతాలకు కూడా సంజీవని లాంటిది అని తెలిపారు. అందరికీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వాస్తవాలు తెలియాలి అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ రెడ్డి చెప్పారు.. స్వార్థ రాజకీయల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరు అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
- Tags
తాజావార్తలు
-
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
-
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్లో ‘ఫౌజీ’ పోస్ట్ప్రొడక్షన్ వర్క్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!