Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing XI: టీ20 ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్ను కూడా ఇప్పటికే 0-3తో కోల్పోయింది. సౌతాంప్టన్ వేదికగా శనివారం జరగబోయే ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో ఘోర వైట్వాష్ పరాభవం నుంచి భారత్ బయటపడుతుంది. కనీస పరువు దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, టీ20 ప్రపంచకప్-2026 నాకౌట్ మ్యాచ్లలో వరుసగా 97, 89, 89 పరుగులతో రాణించి భారత్ను ఛాంపియన్గా నిలపడంలో సంజూ శామ్సన్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆ తర్వాత ఐర్లాండ్తో రెండు టీ20లలో 5, 0 పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్తో తొలి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిరాశపరిచాడు. దాంతో యాజమాన్యం సంజూను పక్కనపెట్టి, 15 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. కానీ, వైభవ్ ఇంగ్లండ్తో వరుసగా మూడు మ్యాచ్లలో 13, 14, 15 పరుగులు మాత్రమే చేసి ఫ్లాప్ అయ్యాడు. జట్టు కూడా వరుస పరాజయాలతో సిరీస్ చేజార్చుకుంది.
మరోవైపు వైభవ్తో పాటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం ఘోరంగా విఫలమవుతున్నారు. జట్టు వరుసగా ఓడిపోతుండటంతో హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో జరిగే ఐదో టీ20 కోసం సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాపార్డర్లో ముగ్గురూ లెఫ్టాండర్లే (అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్) ఉండటం జట్టుకు సమస్యగా మారింది. అందుకే సంజూను జట్టులోకి తెచ్చి రైట్-లెఫ్ట్ కాంబినేషన్తో వెళ్లాలని భావిస్తున్నారు. ఒకవేళ వైభవ్ను కొనసాగించాలనుకుంటే.. తిలక్ వర్మ లేదా ఇషాన్ కిషన్లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే తిలక్ ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి అతడిని తీసేయడం కష్టం. మరోవైపు, ఇషాన్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్నప్పటికీ.. వన్డౌన్లో సంజూ ఆడగలడు కాబట్టి ఇషాన్ స్థానంలోనే సంజూ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణల స్థానంలో రవి బిష్ణోయి, సూర్యాంశ్ షెడ్గే రేసులోకి రానున్నారు.
Also Read
ఇంగ్లండ్తో ఐదో టీ20కి భారత అంచనా తుదిజట్టు:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, లిటిల్ ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయి.
తాజావార్తలు
-
Monsoon Alert: ఆగస్టులో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు..
-
Uber-Rapido Merge: ఉబర్, రాపిడో విలీనం..? రవాణా రంగంలో ఊహించని ట్విస్ట్…
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..
-
Ajit Doval: ‘పహల్గామ్ దాడి తర్వాత మోడీ అడిగిన ప్రశ్న ఇదే’.. అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!