President Draupadi Murmu: శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ శ్రీశైలంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శంచుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆలయ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు రాష్ట్రపతి ముర్ము..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఇలా..!
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 11:45 గంటలకు సున్నిపెంట చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం ఆలయానికి వెళ్లే రోడ్డులో సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం నేరుగా భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు వెళతారు. ఆ తర్వాత ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను రాష్ట్రపతి దర్శించుకుంటారు. ఉభయ ఆలయాల్లో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన పూజలు రాష్ట్రపతి నిర్వహించనున్నారు.
స్వామి అమ్మవార్ల దర్శనా నంతరం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో రాష్ట్రపతి భోజనం చేస్తారు. అనంతరం నంది సర్కిల్ కు చేరుకుంటారు.కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రసాద్ స్కీం కింద 47 కోట్లతో దేవస్థానం పరిధిలో నిర్మించిన సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ( సీఆర్వో ) ను, యాంపీ థియేటర్, ఆడియో విజువల్ డిస్ప్లే ఆఫ్ టూరిజం ప్రాజెక్ట్స్ ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన గిరిజన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.
అక్కడ నుంచి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు తిరిగి సుండిపెంట హెలిప్యాడ్ వద్దకు వెళ్లి ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి హైదరాబాద్ కు బయలుదేరుతారు.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటు మొత్తం 1500 మంది పోలీసు లతో భద్రతా చర్యలు చేపట్టారు.రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకొని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్య నారాయణతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీశైలం వచ్చి రాష్ట్రపతిని కలవనున్నారు.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Read Also: Social Media: చంద్రబాబు, జగన్లను అధిగమించిన పవన్ కళ్యాణ్.. కానీ..?
తాజావార్తలు
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!