President Draupadi Murmu: శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ శ్రీశైలంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శంచుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆలయ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు రాష్ట్రపతి ముర్ము..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఇలా..!
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 11:45 గంటలకు సున్నిపెంట చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం ఆలయానికి వెళ్లే రోడ్డులో సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం నేరుగా భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు వెళతారు. ఆ తర్వాత ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను రాష్ట్రపతి దర్శించుకుంటారు. ఉభయ ఆలయాల్లో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన పూజలు రాష్ట్రపతి నిర్వహించనున్నారు.
స్వామి అమ్మవార్ల దర్శనా నంతరం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో రాష్ట్రపతి భోజనం చేస్తారు. అనంతరం నంది సర్కిల్ కు చేరుకుంటారు.కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రసాద్ స్కీం కింద 47 కోట్లతో దేవస్థానం పరిధిలో నిర్మించిన సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ( సీఆర్వో ) ను, యాంపీ థియేటర్, ఆడియో విజువల్ డిస్ప్లే ఆఫ్ టూరిజం ప్రాజెక్ట్స్ ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన గిరిజన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.
అక్కడ నుంచి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు తిరిగి సుండిపెంట హెలిప్యాడ్ వద్దకు వెళ్లి ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి హైదరాబాద్ కు బయలుదేరుతారు.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటు మొత్తం 1500 మంది పోలీసు లతో భద్రతా చర్యలు చేపట్టారు.రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకొని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్య నారాయణతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీశైలం వచ్చి రాష్ట్రపతిని కలవనున్నారు.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Read Also: Social Media: చంద్రబాబు, జగన్లను అధిగమించిన పవన్ కళ్యాణ్.. కానీ..?
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!