New Districts In AP: కొత్త జిల్లాలతో ఆ ఇద్దరికి తలనొప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జిల్లాల పునర్విభజన ఆ మంత్రులిద్దరికీ తలనొప్పులు తెస్తోందా? విపక్షాల విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిళ్లు.. సీఎంకు ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారా? తరుణోపాయం తోచడం లేదా? ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రులెవరు?
జిల్లా విభజన మార్పుకోసం మంత్రులపై ఒత్తిళ్లు
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్. ఇద్దరిలో ఒకరు సీఎం జగన్కు దగ్గరి బందువు.. మరొకరు ఆయనకు ఆత్మీయంగా ఉండే సహచరుడు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ప్రకాశం జిల్లా మూడు ముక్కలైంది. దీనిపై జిల్లావాసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ఒంగోలు కేంద్రంగా ఉండే ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఆప్రాంత ప్రజలతోపాటు వైసీపీ నేతలు మంత్రి బాలినేనిపై ఒత్తిడి తెస్తున్నారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేయాలని పశ్చిమ ప్రాంత అధికారపార్టీ నాయకులు మంత్రి ఆదిమూలపు సురేష్కు ఊపిరాడనీయటం లేదు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాను మార్కాపురం, ఒంగోలు కేంద్రాలుగా రెండు జిల్లాలు చేయాలన్న ప్రతిపాదన మరికొందరిది. దీంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ల డిమాండ్స్కు అనుగుణంగా జైకొట్టగా తప్పని పరిస్థితి ఉందట.
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
బాలినేనికి తలనొప్పిగా మారిన ‘కందుకూరు’
ఇప్పటికే కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు మహీధర్రెడ్డి, నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబుతోపాటు అద్దంకి ఇంచార్జి కృష్ణచైతన్య తమ ప్రాంత ప్రజాప్రతినిధులతో వెళ్లి కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. మిగతా ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్లు కూడా వాస్తవ పరిస్దితులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారట. కందుకూరు డివిజన్ విషయంలో హామీ ఇవ్వగలను కానీ.. నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగింపుపై ఏం చెప్పలేనని తనను కలిసిన వారికి మంత్రి బాలినేని వివరిస్తున్నట్టు సమాచారం. అద్దంకి, కందుకూరు నేతల ఒత్తిళ్లు బాలినేనికి తలనొప్పిగా మారాయట.
మంత్రి సురేష్కు మార్కాపురం సెగలు
మంత్రి ఆదిమూలపు సురేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ జేఏసీ నేతలు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని ముట్టడించారు. పర్యటనకు వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారును అడ్డుకున్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి, రాంబాబులు తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు వస్తుండగా కనిగిరి, దర్శి ఎమ్మెల్యేలు బుర్రా మధుసూధన్ యాదవ్, మద్దిశెట్టి వేణుగోపాల్లు సైలెంట్గా ఉండిపోతున్నారు. దీంతో ప్రత్యేక డిమాండ్ వినిపిస్తున్న మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నేతలను సముదాయించడం సురేష్కు సవాల్గా మారిందట.
తాజావార్తలు
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
-
Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
-
Accidnet: ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..