Magunta Parvathamma Passed Away: మాగుంట కుటుంబంలో విషాదం.. మాగుంట పార్వతమ్మ కన్నుమూత..
- మాగుంట కుటుంబంలో విషాదం..
- మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూత..
- ఒంగోలు ఎంపీగా.. కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన పార్వతమ్మ..
- చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magunta Parvathamma Passed Away: టీడీపీ నేత, ఒంగోలు లోక్సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. ఒంగోలు మాజీ ఎంపీ, దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందారు.. దీంతో ఎంపీ మాగుంట ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. కాగా, మాగుంట పార్వతమ్మ కావలి శాసనభ్యురాలిగా కూడా పనిచేశారు. చాలా సున్నితమైన స్వభావం కలిగిన నేతగా.. అందరని ఆదుకునే మనిషిగా గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలే మాగుంట సుబ్బారామిరెడ్డి కుమారుడు కన్నుమూశాడు.. ఇప్పుడు మాగుంట పార్వతమ్మ చనిపోవడంతో.. ఆ కుటుంబంలో వరుస మరణాలు సంభవించి.. విషాదం నెలకొంది..
Read Also: IND vs BAN: చెపాక్లో ఎన్నడూ చూడని దృశ్యాలు.. మరి కాన్పూర్ పిచ్ సంగతేంటి?
Also Read
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
కాగా, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బెజవాడ రామారెడ్డి దంపతులకు 1947 జూలై 27న జన్మించారు పార్వతమ్మ.. ఆమె కస్తూరి దేవి బాలికల పాఠశాల నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. ఇక, 19 ఫిబ్రవరి 1967న మాగుంట సుబ్బరామ రెడ్డితో పార్వతమ్మ వివాహం జరిగింది.. 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుండి పోటీ చేసి గెలిచి 11వ లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.. మాగుంట పార్వతమ్మ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. అయితే, 2012లో జరిగిన ఒంగోలు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు..
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!
-
Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!