Power Cut Effect: అనంతపురంలో పరిశ్రమలకు విద్యుత్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఇస్తున్న షాక్ మామూలుగా లేదు. ఆదివారం సెలవుకు తోడు, సోమవారం పవర్ హాలిడే ఇవ్వడంతో పరిశ్రమలు నష్టాల దిశగా పయనిస్తున్నాయి. దీనికి తోడు అనధికారిక కోతలతో పరిశ్రమలో పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగుల వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. గ్రానైట్, జీన్స్తోపాటు అనంతపురం, హిందూపురంలలో పారిశ్రామిక వాడలో ఒక విధమైన స్తబ్థత నెలకొంది. ఈ ప్రభావం కార్మికులపై కూడా పడుతుండటంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏర్పడిన విద్యుత్ సంక్షోభం ఏపీలో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పరిశ్రమలకు ప్రధానంగా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరో రోజు సెలవు ప్రకటించుకోవాలని, నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50 శాతం విద్యుత్ మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం అనంతపురం జిల్లాలోని పరిశ్రమలకు పిడుగు లాంటి వార్త అనే చెప్పాలి. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఉన్నదే అరకొర. వాటిలో ప్రధానంగా జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడ, అలాగే హిందూపురంలోని పారిశ్రామిక వాడ, తాడిపత్రి ప్రాంతంలోని గ్రానైట్ పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమలు, ఇటు రాయదుర్గంలోని జీన్స్ పరిశ్రమలు ప్రధానమైనవి. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పరిశ్రమల నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
అనంతపురం జిల్లా కేంద్రంలో సుమారు 53 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ పరిశ్రమలకు పగటి పూట నిరంతరాయంగా ఉంటే కొంత వరకు వర్క్ అవుట్ అవుతుంది. కానీ ఆదివారం సెలవు, సోమవారం పవర్ హాలిడే, మిగిలిన రోజుల్లో 50 శాతం మాత్రమే విద్యుత్ వాడుకోవాలంటే.. అసలు పరిశ్రమలు నడిచే పరిస్థితే కనిపించడం లేదు. నిరంతరాయంగా విద్యుత్ కోతలు ఉన్నా తట్టుకోవచ్చుకానీ.. ఇలా గంటా రెండు గంటలు కోతలు ఉంటే పరిశ్రమలు ముందుకు సాగే పరిస్థితే లేదని అంటున్నారు. Spot
రాయదుర్గంలో పెద్దఎత్తున ఉపాధి కల్పించే జీన్స్ ప్యాంట్ల పరిశ్రమ… విద్యుత్ కోతల కారణంగా చతికిలపడిపోతోంది. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో దుస్తుల తయారీ పరిశ్రమల యజమానులు, వాటిపై ఆధారపడిన కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇక్కడున్న ఎల్జీ టైర్ల పరిశ్రమ, విప్రో, కామధేను స్టీల్స్, పవర్గేర్, రోల్వెల్, బ్రిటీష్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, సూర్య పైప్స్, స్టీల్ పరిశ్రమలు 19, రసాయన పరిశ్రమలు 9, వస్త్ర తయారీ పరిశ్రమలు 5 ఇలా.. దాదాపు వంద పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 18 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం వీరంతా వారంలో రెండు మూడు రోజులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఇటు రాయదుర్గంలో కూడా జీన్స్ పరిశ్రమపై విద్యుత్ కోతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రాయదుర్గంలో జీన్స్ ప్యాంట్ల తయారీ పరిశ్రమ… కరోనాకు ముందు 12 వేల మంది వరకు ఉపాధి కల్పించేది. నోట్ల రద్దు, కరోనా మహమ్మారి ఈ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న పరిశ్రమలపై విద్యుత్ కోతలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని పరిశ్రమ యజమానులు అంటున్నారు. దీనిపై ఆధారపడిన కూలీలు సైతం ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ప్రస్తుతం 350 పరిశ్రమలు 150 మాత్రమే నడుస్తున్నాయి. కరోనా వల్ల ఈ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో పడిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ విద్యుత్ కోతలు విధించడంతో పరిశ్రమల యజమానులు తీవ్ర నష్టాలు మూటగట్టుకునే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. Spot
ఇటు చేనేత పరిశ్రమపైనా ఈ ప్రభావం కొంతవరకు కనిపిస్తోంది. జిల్లాలో విద్యుత్ కోతల వలన పరిశ్రమల యజమానులే కాకుండా కార్మికులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అసలే చాలీచాలని వేతనాలు ఉన్న నేపథ్యంలో ఉన్న కాస్త దాంట్లో కూడా కోతలు పడితే ఎలా బతికేదని కార్మికులు అంటున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!