వాలంటీరే కాలయముడు.. కల్తీ కల్లు మరణాల కేసులో వీడిన మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఈనెల 2న కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. లోదొడ్డి గ్రామ వాలంటీర్ వంతల రాంబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను వారు వెల్లడించారు. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబు సన్నిహితంగా ఉండేవాడని.. గత నెలలో అతడు సన్నిహితంగా ఉన్న మహిళ మరిదితో గొడవ జరిగిన కారణంగా గ్రామ పెద్దలు రాంబాబును హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఆ మహిళ దూరం కావడంతో రాంబాబు అసహనానికి లోనయ్యాడని… ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం పన్ని ఈనెల 1న రాత్రి కల్లు తాగే ముంతలో కలుపుమొక్కలను నాశనం చేసే గడ్డిమందు కలిపాడని వెల్లడించారు.
Read Also: ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ఎప్పుడూ చెట్టు నుంచి కల్లు దించాక తొలుత మహిళ భర్తే తాగేవాడని.. ఆ తర్వాత మిగిలిన వారికి పంచేవాడని.. ఇదే వ్యూహంతో మహిళ భర్తను అడ్డుతొలగించుకోవాలని వాలంటీర్ రాంబాబు కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. అయితే అనూహ్యంగా మహిళ భర్తతో పాటు మరో నలుగురు ఒకేసారి కల్లు తాగారని.. దీంతో మహిళ భర్తతో పాటు మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాగా ఎక్కడైనా నేరం జరిగితే దాన్ని రాజకీయం చేయకుండా పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాకు హితవు పలికారు.
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..