Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- 2027 జూన్ నాటికి పూర్తి లక్ష్యం
- కేంద్రం నుంచి రూ.3,300 కోట్ల అదనపు నిధులు
- న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
- పునరావాసం, నిర్మాణ పనులకు వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Project : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరప్రదాయిని, జీవనాడి అయిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టు నిర్మాణ గడువును 2027 జూన్ నాటికి ఖరారు చేయడంతో పాటు, నిధుల కొరత లేకుండా భారీ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలశక్తి శాఖ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే రూ.2,300 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.3,300 కోట్ల అదనపు నిధుల మంజూరుకు అంగీకరించింది.
ఈ నిధులను వచ్చే సెప్టెంబర్ నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనివల్ల ప్రాజెక్టు పనులతో పాటు పునరావాస కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి.ప్రాజెక్టు పురోగతిపై శుక్రవారం న్యూఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు , ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు , ముంపు ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు.
Also Read
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో, 194.6 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించేలా తదుపరి కార్యాచరణను కార్యదర్శి కాంతారావు నిర్దేశించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రెండో దశ భూసేకరణ , పునరావాస (R&R) ప్యాకేజీ అమలుపై కూడా అధికారులు ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు స్వయంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలు , ముంపు గ్రామాల్లో పర్యటించారు. పనుల వేగాన్ని, బాధితులకు అందుతున్న పునరావాస సేవలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ మద్దతుతో, దశాబ్దాల నాటి ఆంధ్రుల కల 2027 జూన్ నాటికి సాకారం కానుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!