AP: సర్కార్ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్.. హైకోర్టులో పిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలతో కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు చేరింది.. వరద ఉదృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.. భారీ వర్షాలు, వరదలతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో రాత్రికి రాత్రే ప్రాణాలరచేత బట్టుకోని బయటపడ్డారు పలు ప్రాంతవాసులు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. అయితే, వరదలకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.. ఇక, ఆ పిల్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.. ప్రతివాదులుగా ఏపీ సీఎస్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కడప కలెక్టర్, రాజంపేట ఆర్డీవోలను పేర్కొంటూ పిల్ దాఖలు చేశారు బీజేపీ నేత రమేష్ నాయుడు.
Read Also: AP: నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ ఉక్కుపాదం
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 33 మంది ప్రాణాలు కొల్పోయారని పిటిషనర్ పేర్కొన్నారు.. పెద్ద ఎత్తున మామిడి, నిమ్మ, అరటి, దానిమ్మ, కొబ్బరి, టొమోట తోటలు నష్టపోయాయన్న పిటిషనర్.. మృతుల కుటుంబాలకు.. పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ హైకోర్టును కోరారు.. ఇక, విచారణకు స్వీకరించి హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. ఇదే సమయంలో బాధితులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందోననే వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ను ఆదేశించింది.. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
తాజావార్తలు
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా
-
చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
-
Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు
-
IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!