Kurnool: అమ్మ ఒడి వద్దు.. రోడ్డు వేయించండి.. మంత్రికి నిరసన సెగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను స్థానిక అధికారులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. నెలలో 10 సచివాలయాలను సందర్శించేలా ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారు.
Nara Lokesh: జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్తో.. ప్రజలు బతకలేకపోతున్నారు
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
అయితే కర్నూలు జిల్లాలో చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగిలింది. ఆలూరు మండలం హాత్తిబెళగల్లో అమ్మ ఒడి లేకున్నా పర్లేదు.. రోడ్డు వేయించాలని మంత్రి జయరాంను స్థానికులు నిలదీశారు. ఇప్పటివరకు అమ్మ ఒడి డబ్బులు పడలేదని.. అదిపోతే పోయింది.. రోడ్డు మాత్రం బాగు చేయించాలని గ్రామస్తులు కోరారు. మరోవైపు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జయరాం సమక్షంలో గ్రామస్తులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
-
Peddi : ‘పెద్ది’తో రామ్చరణ్ పాన్ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
-
Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
-
Hypersonic Missiles: హైపర్సోనిక్ క్షిపణి టెక్నాలజీలో భారత్ కీలక విజయం.. DRDO స్క్రామ్జెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
-
HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!