నాలుగు దశాబ్దాల తర్వాత మడకశిర పెద్ద చెరువుకు జలకళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం మడకశిర పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది.ఈ చెరువు రాష్ట్రంలోని నైరుతి మూలలో కర్ణాటక సరిహద్దులకు సమీపంలోని ఆనుకుని ఉంది. ఈ చెరువు కర్ణాటకలోని సమీప కాలువల ద్వారా తీసుకువెళ్లే వర్షపునీటిపై ఆధారపడి ఉంది. దశాబ్దాలుగా మడకశిర మునిసిపాలిటీ, సమీప గ్రామాలకు ఇది ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. పట్టణంలోని ప్రజలకు 3కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని అందించేందుకు చెరువుల్లో వేసిన బోరు బావుల ద్వారా నీటినిసరఫరా చేస్తున్నారు. భారీ వర్షాలకు తోడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర ప్రాంతానికి నీటిని తీసుకెళ్లే హంద్రీ నీవా సుజల స్రవంతి రెండో దశ సాగునీటి ప్రాజెక్టుకు సైతం నాలుగు దశాబ్దాల తర్వాత పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరింది.
మడకశిరలో పండుగ వాతావరణం
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో నీటి వనరులు తక్కువగా ఉన్న సమయంలో మడకశిరకు నీటి ఇబ్బందులు ఏర్పడలేదు. గత కొన్ని దశాబ్దాలుగా భూగర్భ జల వనరులు క్షీణించడం,కరువు ఏర్పడినప్పుడు కూడా ప్రజలు నీటికోసం అంతగా ఇబ్బందులు పడలేదు. అయితే 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెరువు పూర్వ జళకళను సంతరించుకోవడంతో మడకశిర వేడుకలను అక్కడి ప్రజలు నిర్వహించుకున్నారు. దాదాపు కొన్నేళ్లుగా అక్కడి తాగు అవసరాలకు ఈ చెరువే ఆధారం అయింది. ఏది ఏమైనా చెరువు నీటి మట్టం పూర్తి స్థాయిలో చేరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ చిన్న నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న బలరాం 40 ఏళ్ల కిందట మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. “నా ఊరికి ఇది ఒక ప్రత్యేక సందర్భం. 40 ఏళ్ల కిందట పెద్ద చెరువు పొంగిపొర్లడాన్ని చూసి పట్టణవాసులంతా సంబరాలు చేసుకున్నారు, ఇప్పుడు మళ్లీ పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది” అని ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం:ఎమ్మెల్యే తిప్పేస్వామి
ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి చెరువును సందర్శించారు. రెండు పార్టీలు కృష్ణా నీటిని టెయిల్ ఎండ్ వరకు, ఏపీలోని ఎత్తైన ప్రాంతానికి తీసుకురాగలిగామని వారు అన్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ చెరువు ప్రాంతాన్ని ట్యాంక్ బండ్గా రీతీలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద చెరువుకు సమీపంలో పర్యాటక కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ అనుమతి ఇవ్వడంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని ఎమ్మెల్యే చెప్పారు.
తాజావార్తలు
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!