నాలుగు దశాబ్దాల తర్వాత మడకశిర పెద్ద చెరువుకు జలకళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం మడకశిర పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది.ఈ చెరువు రాష్ట్రంలోని నైరుతి మూలలో కర్ణాటక సరిహద్దులకు సమీపంలోని ఆనుకుని ఉంది. ఈ చెరువు కర్ణాటకలోని సమీప కాలువల ద్వారా తీసుకువెళ్లే వర్షపునీటిపై ఆధారపడి ఉంది. దశాబ్దాలుగా మడకశిర మునిసిపాలిటీ, సమీప గ్రామాలకు ఇది ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. పట్టణంలోని ప్రజలకు 3కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని అందించేందుకు చెరువుల్లో వేసిన బోరు బావుల ద్వారా నీటినిసరఫరా చేస్తున్నారు. భారీ వర్షాలకు తోడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర ప్రాంతానికి నీటిని తీసుకెళ్లే హంద్రీ నీవా సుజల స్రవంతి రెండో దశ సాగునీటి ప్రాజెక్టుకు సైతం నాలుగు దశాబ్దాల తర్వాత పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరింది.
మడకశిరలో పండుగ వాతావరణం
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో నీటి వనరులు తక్కువగా ఉన్న సమయంలో మడకశిరకు నీటి ఇబ్బందులు ఏర్పడలేదు. గత కొన్ని దశాబ్దాలుగా భూగర్భ జల వనరులు క్షీణించడం,కరువు ఏర్పడినప్పుడు కూడా ప్రజలు నీటికోసం అంతగా ఇబ్బందులు పడలేదు. అయితే 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెరువు పూర్వ జళకళను సంతరించుకోవడంతో మడకశిర వేడుకలను అక్కడి ప్రజలు నిర్వహించుకున్నారు. దాదాపు కొన్నేళ్లుగా అక్కడి తాగు అవసరాలకు ఈ చెరువే ఆధారం అయింది. ఏది ఏమైనా చెరువు నీటి మట్టం పూర్తి స్థాయిలో చేరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ చిన్న నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న బలరాం 40 ఏళ్ల కిందట మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. “నా ఊరికి ఇది ఒక ప్రత్యేక సందర్భం. 40 ఏళ్ల కిందట పెద్ద చెరువు పొంగిపొర్లడాన్ని చూసి పట్టణవాసులంతా సంబరాలు చేసుకున్నారు, ఇప్పుడు మళ్లీ పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది” అని ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం:ఎమ్మెల్యే తిప్పేస్వామి
ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి చెరువును సందర్శించారు. రెండు పార్టీలు కృష్ణా నీటిని టెయిల్ ఎండ్ వరకు, ఏపీలోని ఎత్తైన ప్రాంతానికి తీసుకురాగలిగామని వారు అన్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ చెరువు ప్రాంతాన్ని ట్యాంక్ బండ్గా రీతీలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద చెరువుకు సమీపంలో పర్యాటక కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ అనుమతి ఇవ్వడంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని ఎమ్మెల్యే చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!