Peddireddy: గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం.. సీఎం జగన్ తెచ్చారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ స్వరాజ్యం అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని చేసి చూపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. ఎంపీటీసీ సభ్యులకు, కో-ఆప్షన్ సభ్యులకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రొగ్రామ్లో ఆయన మాట్లాడుతూ.. అందరికీ అభినందనలు తెలిపారు.. ఇక, గతంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని.. స్థానిక సంస్థలు అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే సభ్యులకు బాధ్యతను గుర్తు చేయాలని సీఎం సూచించారని.. అందుకే ఎంపీటీసీ సభ్యులకు, కో-ఆప్షన్ సభ్యులకు ట్రైనింగ్ ఏర్పాటు చేశామన్నారు.. ఇప్పటికే 1.35 లక్షల మంది వార్డు మెంబర్లకు ట్రైనింగ్ ఇచ్చామని.. 13,086 మంది సర్పంచ్లకు కూడా ట్రైనింగ్ క్లాసులు నిర్వహించామన్న ఆయన.. ఎంపీపీలకి ప్రత్యేకంగా మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.. అదేవిధంగా జెడ్పీటీసీలకు కూడా ట్రైనింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
Read Also: TDP: విశాఖలో ‘వీజే’ టాక్స్.. తుఫాన్ కంటే వేగంగా వైజాగ్ను ధ్వంసం చేస్తున్నారు..!
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
గతంలో ఎప్పుడూ లేని విధంగా 50 శాతం మంది మహిళా సభ్యులు ఉన్నారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్న ఆయన.. గ్రామ స్వరాజ్యం అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని చేసి చూపిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే అన్నారు.. ప్రతి 2000 మందికి సచివాలయం ఏర్పాటు చేశారు.. సచివాలయ వ్యవస్థలో ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములే.. ఇదే విషయం అన్ని సచివాలయాలకు తెలియజేస్తామన్న ఆయన.. గ్రామాల పరిశుభ్రతపై ఎంపీటీసీ సభ్యులు శ్రద్ద వహించాలని.. ప్రతీ పంచాయతీకి ట్రాక్టర్ ఇస్తున్నాం, అందరూ శ్రద్ద తీసుకుని చెట్లు నాటించాలని సూచించారు.. ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి.. ఎంపీటీసీలు చేసే అభివృద్ధి గ్రామాల్లో గుర్తుండి పోవాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!