తెలంగాణలో కంటే ముందే ఏపీలో అధికారంలోకి వస్తాం: పరిపూర్ణానంద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహసభలో ఆ పార్టీ నేత పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2018లో తాను అడుగు పెట్టగానే.. ‘బండి’ కదిలిందని… ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టడంతో ఇక్కడ కూడా సోము బండి కదులుతుందన్నారు. ఏపీ ప్రజలు తెలియక ఫ్యాన్ స్పీడును 151కి పెంచేశారని.. ఎప్పుడైనా ఈ ఫ్యాన్ పడిపోవడం ఖాయమన్నారు. జగన్ హిందూవునని నమ్మించి ఓట్లేయించుకున్నారని ఆరోపించారు. ఏపీలో పలు చోట్ల ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనా పట్టించుకోలేదని.. రామతీర్ధంలో రాముని తల తీసేసినా వ్యక్తిని పట్టుకోలేకపోయారని మండిపడ్డారు. రథాన్ని చెక్క అంటూ ఓ మంత్రి కామెంట్ చేశారంటే ఏం అనాలో అర్థం కావడం లేదన్నారు.
Read Also: న్యూఇయర్ ట్రీట్.. ఏపీలో మద్యం ప్రియులకు గుడ్న్యూస్
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
తెలంగాణ కంటే ముందే ఏపీలోనే బీజేపీ ముందు అధికారంలోకి వస్తుందని పరిపూర్ణానంద స్వామి అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు-జగన్ ఇద్దరూ చారిత్రాక తప్పిదాలు చేశారని.. 2022 చివరికో.. 2023 ఆదిలోనో ఏపీ ప్రభుత్వం ఏమవుతుందో తానైతే చెప్పలేనన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేస్తే… కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్ ఆత్మను ఏడిపించారని.. అదే చంద్రబాబును కన్నీళ్లు పెట్టించిందని పరిపూర్ణానంద ఆరోపణలు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ పాదాల దగ్గర చంద్రబాబు తాకట్టు పెడితే… జగన్ మాతృభాషను జెరూసలెంలో తగులబెట్టారని… తెలుగు భాషను పట్టించుకోకుండా ఇంగ్లీష్ను జగన్ నెత్తిన పెట్టుకుంటున్నారని విమర్శించారు.
అఖండ సినిమా ఏమో కానీ.. ప్రధాని మోదీ అసలైన అఖండుడు అని పరిపూర్ణానంద ప్రశంసలు కురిపించారు. ఒవైసీని మోడీ-యోగి కలిసి బ్యాండ్ బజాయిస్తారని… అందుకు యూపీ నుంచి యోగి హైదరాబాద్ వరకు వస్తారన్నారు. మోడీ-యోగిని చూసి ఒవైసీ పారిపోవడం ఖాయమన్నారు. మందిరాలను నిర్మించడమే కాదు.. గుడిసెలను భవనాలుగా కూడా బీజేపీ మార్చగలదని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?