Scrub Typhus: వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి.. డీఎంహెచ్వో వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scrub Typhus: స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. పల్నాడు జిల్లా డీఎంహెచ్వో రవికుమార్ స్క్రబ్ టైఫస్ కేసులపై వివరణ ఇచ్చారు.. జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే, ఈ వ్యాధి గురించి ప్రజలు అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీఎంహెచ్వో రవికుమార్ వివరాల ప్రకారం, స్క్రబ్ టైఫస్ ప్రాణాంతక వ్యాధి కాదు.. ఇది ఒక రకమైన చిన్న పురుగు.. నల్లిని పోలిన చిగర్ మైట్.. కరిచినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ మాత్రమే. ముఖ్యంగా, ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికీ సోకదు, అంటురోగం కాదని ఆయన తెలిపారు.
Read Also: Jihad Remark: ‘‘జిహాద్’’ చేయాల్సి రావచ్చు.. పార్లమెంట్ సాక్షిగా ఎస్పీ ఎంపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
స్క్రబ్ టైఫస్కు సాధారణంగా కనిపించే లక్షణాల గురించి వివరిస్తూ.. జ్వరం, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి.. ఈ లక్షణాలు నాలుగు–ఐదు రోజులకు పైగా కొనసాగితే వెంటనే సమీప ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వ్యాధికి “డాక్సిసైక్లిన్” అనే టాబ్లెట్ వాడితే త్వరగా నయం అవుతుందని తెలిపారు.
రాజుపాలెం ఆర్ఆర్ కాలనీకి చెందిన నాగమ్మ అనే మహిళకు గత నెల 8న జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరారు. 14వ తేదీన గుంటూరు జీజీహెచ్ఎకు రిఫర్ చేయగా, రిపోర్టులు రాక ముందే 16న చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. రుద్రవరంకికి చెందిన జ్యోతి కూడా ఇదే లక్షణాలతో మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతి చెందారు. ఈ ఇద్దరి రిపోర్టులు వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎంహెచ్వో వెల్లడించారు..
వ్యవసాయ కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి..?
పొలం పనులకు వెళ్లే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. పనిచేస్తున్న సమయంలో పురుగు కుట్టినట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, భయపడాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు డీఎంహెచ్వో రవికుమార్..
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!