Ambati Rambabu: పిన్నెల్లిని పరామర్శించిన అంబటి.. పోలీసులు, సర్కార్పై తీవ్ర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: పల్నాడు జిల్లాలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా గుంటూరు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా ఆయనతో కలిసి పాల్గొన్నారు. పిన్నెల్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అంబటి రాంబాబు ప్రభుత్వం మరియు పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ కక్షతోనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని కూటమి ప్రభుత్వం 98 రోజుల పాటు జైలులో ఉంచిందని ఆరోపించారు. గుండ్లపాడు ఘటనలో ఒక వర్గానికి చెందిన వారు మరొక వర్గాన్ని హత్య చేసినప్పటికీ, ఆ కేసులో పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించారని పేర్కొన్నారు అంబటి..
Read Also: Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
రాజకీయంగా తమకు అడ్డుగా ఉన్నారని భావించి టీడీపీ నాయకులు పిన్నెల్లి సోదరులపై తప్పుడు మర్డర్ కేసులు పెట్టారని విమర్శించారు అంబటి. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరియు జూలకంటి బ్రహ్మారెడ్డి కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. అయితే, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. తన ఇంటిపై 7 గంటల పాటు దాడి జరిగినప్పటికీ పోలీసులు స్పందించలేదని, తాను హత్యాయత్నం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు అధికార నాయకులకు బానిసల్లా పనిచేస్తున్నారని, పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే తలుపులు వేసుకుని నిరసన తెలిపే స్థితికి ప్రభుత్వం దిగజారిపోయిందని విమర్శించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఘటనపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇక, ఎక్కడైనా శవం కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఈ కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్గా మారిందని విమర్శిస్తూ, జగన్ నేతృత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!