Narsaraopet: పల్నాడు జిల్లా ఎఫెక్ట్.. అక్కడ రియల్ బూమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. నర్సరావుపేటలో జిల్లా కార్యాలయాలా ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఇతర జిల్లా శాఖల కార్యాలయాలు కూడా పేటకు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతం మొత్తం హడావుడిగా మారిపోయింది. ఇదే సమయంలో నర్సరావుపేటలో రియల్ బూమ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
కొత్త జిల్లా కేంద్రంగా నర్సరావుపేట మారనుండడంతో ఈ ప్రాంతంలో భూములు కొనేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ భూముల ధరలు రెట్టింపయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతున్న లింగంగుట్ల రోడ్డు, ఉప్పలపాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్లలో భూముల ధరలు రెట్టింపయ్యాయి. ఇక నర్సరావుపేటనుంచి రావిపాడు వెళ్లే రోడ్డు, పాలపాడు రోడ్డు, వినుకొండ రోడ్డులో కూడా ధరలు భారీగానే పెరిగాయి. రియల్ బూమ్ పెరగడంతో వ్యాపారులు కూడా ఇక్కడ కొత్త కొత్త వెంచర్లు మొదలుపెట్టారు. రైతులనుంచి పొలాలు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నర్సరావుపేట చుట్టుపక్కల దాదాపు 100కుపైగా కొత్త వెంచర్లు రావడంతో ఇక్కడ రియల్ బూమ్ ఏర్పడింది.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
మరోవైపు నర్సరావుపేటలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాలవారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా నర్సరావుపేటలో స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లలో స్థలాలు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
గతంలో 20నుంచి 30లక్షలు ఉన్న పొలాల ధరలు ఇప్పుడు ఏకంగా కోటిరూపాయలకు చేరాయి. స్థలాల ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. గతంలో సెంటు స్థలం ధర 4లక్షల వరకూ ఉంటే ప్రస్తుతం 8నుంచి 10 లక్షల వరకూ పలుకుతుందంటున్నారు స్థానికులు. కొత్త జిల్లా ప్రకటన తర్వాత పేటలో స్థలాల ధరలు రెట్టింపయ్యాయంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భూముల ధరలు రెండురెట్లు పెరిగాయి కూడా. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి స్థలాలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుండడంతో భూముల రేట్లు పెరిగాయంటున్నారు స్థానికులు. జిల్లా ఏర్పాటు కాకముందే ధరలు ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తులో పేటలో భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.
తాజావార్తలు
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?