Narsaraopet: పల్నాడు జిల్లా ఎఫెక్ట్.. అక్కడ రియల్ బూమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. నర్సరావుపేటలో జిల్లా కార్యాలయాలా ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఇతర జిల్లా శాఖల కార్యాలయాలు కూడా పేటకు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతం మొత్తం హడావుడిగా మారిపోయింది. ఇదే సమయంలో నర్సరావుపేటలో రియల్ బూమ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
కొత్త జిల్లా కేంద్రంగా నర్సరావుపేట మారనుండడంతో ఈ ప్రాంతంలో భూములు కొనేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ భూముల ధరలు రెట్టింపయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతున్న లింగంగుట్ల రోడ్డు, ఉప్పలపాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్లలో భూముల ధరలు రెట్టింపయ్యాయి. ఇక నర్సరావుపేటనుంచి రావిపాడు వెళ్లే రోడ్డు, పాలపాడు రోడ్డు, వినుకొండ రోడ్డులో కూడా ధరలు భారీగానే పెరిగాయి. రియల్ బూమ్ పెరగడంతో వ్యాపారులు కూడా ఇక్కడ కొత్త కొత్త వెంచర్లు మొదలుపెట్టారు. రైతులనుంచి పొలాలు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నర్సరావుపేట చుట్టుపక్కల దాదాపు 100కుపైగా కొత్త వెంచర్లు రావడంతో ఇక్కడ రియల్ బూమ్ ఏర్పడింది.
Also Read
మరోవైపు నర్సరావుపేటలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాలవారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా నర్సరావుపేటలో స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లలో స్థలాలు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
గతంలో 20నుంచి 30లక్షలు ఉన్న పొలాల ధరలు ఇప్పుడు ఏకంగా కోటిరూపాయలకు చేరాయి. స్థలాల ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. గతంలో సెంటు స్థలం ధర 4లక్షల వరకూ ఉంటే ప్రస్తుతం 8నుంచి 10 లక్షల వరకూ పలుకుతుందంటున్నారు స్థానికులు. కొత్త జిల్లా ప్రకటన తర్వాత పేటలో స్థలాల ధరలు రెట్టింపయ్యాయంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భూముల ధరలు రెండురెట్లు పెరిగాయి కూడా. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి స్థలాలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుండడంతో భూముల రేట్లు పెరిగాయంటున్నారు స్థానికులు. జిల్లా ఏర్పాటు కాకముందే ధరలు ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తులో పేటలో భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!