Narsaraopet: పల్నాడు జిల్లా ఎఫెక్ట్.. అక్కడ రియల్ బూమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. నర్సరావుపేటలో జిల్లా కార్యాలయాలా ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఇతర జిల్లా శాఖల కార్యాలయాలు కూడా పేటకు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతం మొత్తం హడావుడిగా మారిపోయింది. ఇదే సమయంలో నర్సరావుపేటలో రియల్ బూమ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
కొత్త జిల్లా కేంద్రంగా నర్సరావుపేట మారనుండడంతో ఈ ప్రాంతంలో భూములు కొనేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ భూముల ధరలు రెట్టింపయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతున్న లింగంగుట్ల రోడ్డు, ఉప్పలపాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్లలో భూముల ధరలు రెట్టింపయ్యాయి. ఇక నర్సరావుపేటనుంచి రావిపాడు వెళ్లే రోడ్డు, పాలపాడు రోడ్డు, వినుకొండ రోడ్డులో కూడా ధరలు భారీగానే పెరిగాయి. రియల్ బూమ్ పెరగడంతో వ్యాపారులు కూడా ఇక్కడ కొత్త కొత్త వెంచర్లు మొదలుపెట్టారు. రైతులనుంచి పొలాలు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నర్సరావుపేట చుట్టుపక్కల దాదాపు 100కుపైగా కొత్త వెంచర్లు రావడంతో ఇక్కడ రియల్ బూమ్ ఏర్పడింది.
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
మరోవైపు నర్సరావుపేటలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాలవారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా నర్సరావుపేటలో స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లలో స్థలాలు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
గతంలో 20నుంచి 30లక్షలు ఉన్న పొలాల ధరలు ఇప్పుడు ఏకంగా కోటిరూపాయలకు చేరాయి. స్థలాల ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. గతంలో సెంటు స్థలం ధర 4లక్షల వరకూ ఉంటే ప్రస్తుతం 8నుంచి 10 లక్షల వరకూ పలుకుతుందంటున్నారు స్థానికులు. కొత్త జిల్లా ప్రకటన తర్వాత పేటలో స్థలాల ధరలు రెట్టింపయ్యాయంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భూముల ధరలు రెండురెట్లు పెరిగాయి కూడా. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి స్థలాలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుండడంతో భూముల రేట్లు పెరిగాయంటున్నారు స్థానికులు. జిల్లా ఏర్పాటు కాకముందే ధరలు ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తులో పేటలో భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.
తాజావార్తలు
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!