Onion Prices Down: ఉల్లి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీకావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లి లేకుండా కూరలు పూర్తి కావు.. ఒకప్పుడు ఉల్లి ధరల కారణంగా ప్రభుత్వాలు పతనం అయిన సందర్భాలు అనేకం. కిలో సెంచరీలు దాటిన ఉల్లితో మహిళలు ప్రభుత్వాలపై శాపనార్ధాలు పెట్టారు. తాజాగా ఉల్లి ధర పతనం అయింది. ఎంతగా అంటే గతంలో ఉల్లి కొనలేక కన్నీళ్ళు వస్తే.. ఇప్పుడు ఉల్లి అమ్మేందుకు అవకాశం లేక… గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధర పతనమైంది. ఎప్పటిలాగే రైతు పండించిన పంట మార్కెట్ కు రాగానే ధర పడిపోయింది. ధర లేకపోవడంతో పంటకోసి మార్కెట్ లో అమ్మితే వచ్చే నష్టం భరించడంనకంటే పంట దున్నేస్తే తక్కువ నష్టం వస్తుంది. కొందరు రైతులు పండించిన పంటనే దున్నేస్తున్నారు. మరికొందరు ఎంతో కొంత వస్తుందన్న ఆశతో మార్కెట్ కు తీసుకువెళ్లి నష్టపోతున్నారు.
ఉల్లి ధర పతనం రైతుల్ని బాగా ఇబ్బందిపెడుతోంది. అప్పులు చేసిన మరీ ఉల్లి సాగుచేశారు వేలాదిమంది రైతులు. ఇప్పుడు ఉల్లి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంటను తొలగిస్తున్నారు. దేవనకొండ మండలంలో ఓ రైతు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని 4లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేసాడు. పండిన ఉల్లిన కోసి, గ్రేడింగ్ చేసి, ట్రాక్టర్ లో మార్కెట్ కు తరలిస్తే కూలీలు, రవాణా ఖర్చు కనీసం 3 లక్షలు వ్యయం అవుతుంది. మార్కెట్ లో సరుకు అమ్మితే 2 లక్షలు కూడా చేతికి రాదు. దీంతో ఉల్లి పంటను 12 వేలు ఖర్చు పెట్టి ట్రాక్టర్ తో దున్నించాడు. కూలీలు, ఎరువులు, కౌలు మొత్తం ఖర్చులు అప్పు చేసి ఉల్లి సాగు చేస్తే పెట్టుబడి మొత్తం కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?
Read Also: K.Chandrashekar Rao : దేశంలో మతపిచ్చి ఎవరికి మంచిది.. అంతా బాగుండాలి.. అందులో మనం ఉండాలి
ఇటీవలి కాలంలో వర్షాలు బాగా పడ్డాయి. దీంతో కర్నూలు జిల్లాలో ఉల్లి దిగుబడులు మొదలయ్యాయి. ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తరలి వస్తోంది. ఉల్లి ధర పడిపోయింది. బహిరంగ మార్కెట్ లో ఉల్లి కిలో 20 నుంచి 30 రూపాయలు ఉంది. అయితే రైతుల నుంచి క్వింటాలు ఉల్లి 400 నుంచి 800 పలుకుతోంది. వినియోగదారులకు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. అంటే రైతు వద్ద కిలో 4 నుంచి 8 రూపాయాలు కొంటున్నారు. ఉల్లి గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఎకరాకు 75 వేలకు పైగానే ఉందని, ఇప్పటి ధర పెట్టుబడికి కూడా రావడం లేదంటున్నారు రైతులు. దళారులు ఉల్లి ధర రైతులకు దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతుంది. ఇతర రాష్ట్రాలకు కర్నూలు జిల్లా నుంచి ఉల్లి ఎగుమతి అవుతుంది. రైతులకు ఎప్పుడో ఒకసారి కానీ మంచి ధర దక్కదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ధర పడిపోతుందేమోనన్న భయం రైతుల్లో ఉంది. ఇప్పటికే కర్నూలు మార్కెట్ కు 1300 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. కనిష్ట ధర 415 కాగా గరిష్ట ధర 1150 వుంది. గరిష్ట ధర దక్కేది ఏ ఒకరిద్దరు రైతులకు మాత్రమే దక్కుతుంది. మెజారిటీ రైతులకు దక్కేది 500 నుంచి 800 రూపాయల లోపే. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రతి ఏటా రైతులు కోరుతూనే వున్నారు. రైతులు నష్టపోతూనే వున్నారు. ఇప్పటికైనా ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సరఫరా చేయాలంటున్నారు రైతులు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!