2008 లో సంచలనం సృష్టించిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పును వెలవరించింది. ఈ కేసులో 12 మందికి కోర్టు ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది. హైవేలపై కాపుకాచి, ఇనుముతో వచ్చే లోడు లారీలను, మార్గమధ్యంలో అటకాయించి మున్నా, అతని గ్యాంగ్ ఇనుము లోడును దోచుకునేవారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిల్లర్ మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనేక సంవత్సరాలు ఈ కేసును విచారించిన ఒంగోలు కోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. కిల్లర్ మున్నా గ్యాంగ్ 12 మందికి ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది.