NTR Vaidya Seva: ఏపీలో మూడు రోజులుగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు..
- ఏపీలో మూడో రోజుకు చేరుకున్న ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేత..
- అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేసిన స్పెషాలిటీ ఆస్పత్రులు..
- సీఈవో ఆమోదించిన బిల్లులు రూ. 550 కోట్లు చెల్లించాలి..
- ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు మూడో రోజు కూడా నిలిచిపోయింది. ఈ పథకం కింద సేవలు అందించే స్పెషాలిటీ ఆసుపత్రులు తాత్కాలికంగా సేవలను ఆపేశాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోగులకు చికిత్స అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు తమ డిమాండ్లను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేశారు. సీఈఓ ఆమోదించిన రూ.550 కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఇకపై ప్రతి నెలా రూ.800 కోట్ల చొప్పున బిల్లులు చెల్లించేలా వ్యవస్థను రెగ్యులర్ చేయాలని కోరారు.
Read Also: Vanasthalipuram : మద్యం మత్తులో థార్ కారుతో రెచ్చిపోయిన యువకులు!
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
అయితే, ప్రస్తుతం 2,700 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండటంతో ఆసుపత్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించేలోపు మిగిలిన బిల్లుల చెల్లించడానికి రెడీ కావాలని పేర్కొన్నారు. అలాగే, ఎన్టీఆర్ వైద్యసేవ ప్యాకేజీల రేట్లను ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలని నెట్ వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరోగ్య సేవా పథకాలతో సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలని కోరారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్లో ప్యాకేజీ రేట్లు 30 నుంచి 40 శాతం తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Jubilee Hills By Election: రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..
అలాగే, గ్రీవెన్స్ కమిటీ సమావేశాలను నియమితంగా నిర్వహించాలని, సీఈఓలను తరచుగా మార్చేయడం వల్ల సమాచార లోపానికి, విధానాల అమలులో ఆటంకాలకు కారణమవుతోందని నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు పేర్కొంటున్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకునే ముందు స్పెషాలిటీ ఆసుపత్రులను చర్చల్లో భాగం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్తో చర్చించిన తరువాతే UHC అమలుపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ డిమాండ్లపై సమీక్షిస్తుంది. రాబోయే రోజుల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!