CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
- మహానాడులో ఎన్టీఆర్కు ఘన నివాళులు
- ‘భారతరత్న’పై ఏకగ్రీవ తీర్మానం
- మహిళలకు 33% రిజర్వేషన్పై చంద్రబాబు ప్రకటన
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద మారుమోగిన ‘సీఎం సీఎం’ నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న మహానాడు ఉత్సవాల్లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. దేశానికి, తెలుగుజాతికి ఆయన చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు ప్రవేశపెట్టిన చారిత్రాత్మక తీర్మానాన్ని మహానాడు వేదికగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది కేవలం ఒక పార్టీ డిమాండ్ కాదని, కోట్ల మంది తెలుగు ప్రజల మనోభావమని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఒక సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, వెండితెరపై తిరుగులేని నటుడిగా ఎదిగి, పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైందని సీఎం చంద్రబాబు కొనియాడారు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ చేసిన పాలన దేశ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచిందని, కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం కీలక పాత్ర పోషించేలా ఆయనే పునాదులు వేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాల సాధనలో భాగంగానే భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసే క్రమంలో నారా లోకేష్ ప్రతిపాదించిన మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపును పార్టీలో ముందుగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనగా, నారా భువనేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Also Read
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
- YS Jagan: ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం.. మరో ఏడాదిలో పాదయాత్ర..
తాజావార్తలు
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
-
Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
-
POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
-
Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!