CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
- మహానాడులో ఎన్టీఆర్కు ఘన నివాళులు
- ‘భారతరత్న’పై ఏకగ్రీవ తీర్మానం
- మహిళలకు 33% రిజర్వేషన్పై చంద్రబాబు ప్రకటన
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద మారుమోగిన ‘సీఎం సీఎం’ నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న మహానాడు ఉత్సవాల్లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. దేశానికి, తెలుగుజాతికి ఆయన చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు ప్రవేశపెట్టిన చారిత్రాత్మక తీర్మానాన్ని మహానాడు వేదికగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది కేవలం ఒక పార్టీ డిమాండ్ కాదని, కోట్ల మంది తెలుగు ప్రజల మనోభావమని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఒక సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, వెండితెరపై తిరుగులేని నటుడిగా ఎదిగి, పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైందని సీఎం చంద్రబాబు కొనియాడారు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ చేసిన పాలన దేశ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచిందని, కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం కీలక పాత్ర పోషించేలా ఆయనే పునాదులు వేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాల సాధనలో భాగంగానే భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసే క్రమంలో నారా లోకేష్ ప్రతిపాదించిన మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపును పార్టీలో ముందుగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనగా, నారా భువనేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Also Read
- Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
-
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
-
YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
-
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..