Ap New Districts: సముద్ర తీరం లేని జిల్లాగా గుంటూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జిల్లాల విభజనతో పలు జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోయింది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు వచ్చాయి. ఇదివరకు రాయలసీమలో 4, కోస్తాలో 9 జిల్లాలు అని సులభంగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్పడం కష్టమైన పనే. ఈ విషయంపై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుంది. అయితే జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి.
ఇదివరకు సముద్రతీరం ఉన్న గుంటూరు జిల్లాలో జిల్లాల విభజన అనంతరం సముద్ర తీరం దూరమైంది. బాపట్ల ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు కావడంతో ప్రస్తుతం గుంటూరు జిల్లా తీరం లేని జిల్లాగా మారింది. గతంలో గుంటూరు జిల్లాలో బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరం ఉండేది. ఇప్పుడు సూర్యలంక బాపట్ల జిల్లాలోకి వెళ్లిపోయింది. అలాగే గతంలో సముద్ర తీరం లేని ప్రాంతంగా ఉన్న రాయలసీమ ప్రాంతానికి ఇప్పుడు తీరప్రాంతం వచ్చి చేరింది. గతంలో నెల్లూరు జిల్లాలో తీరప్రాంతంగా ఉన్న సూళ్లూరుపేట, గూడురు అసెంబ్లీ నియోజకవర్గాలను తిరుపతి జిల్లాలో కలపడంతో రాయలసీమకు సముద్రం వచ్చింది.
Also Read
https://ntvtelugu.com/registration-charges-amendment-in-new-district-headquarters-in-andhra-pradesh/
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..