Site icon NTV Telugu

Minister Nara Lokesh: VSR ఏవియేషన్స్తో ఎలాంటి లావాదేవీలు లేవు.. ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు

Lokesh

Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. VSR ఏవియేషన్స్ తో ఎలాంటి లావాదేవీలు లేవని తేల్చి చెప్పారు. కానీసం వాళ్లతో కలిసి ఒక కప్పు కాఫీ కూడా తాగలేదని తేల్చి చెప్పారు. వాళ్ళు మా దగ్గర 2022లో ఫైనాన్స్ తీసుకున్నారు.. ఆ రోజుకి మేము అధికారంలోకి వస్తామని కానీ, మా ఎంపీ ఏవియేషన్ మినిస్టర్ అవుతారని గానీ, అజిత్ పవార్ హెలికాప్టర్ లో ఎక్కుతారని కానీ కల వచ్చిందా.. మేము ఏమైనా జ్యోతిష్యులామా అని పేర్కొన్నారు. ఇక, జగన్ చెప్పిన దానికి మేమెందుకు సమాధానం చెప్పాలి.. క్లారిటీ ఇవ్వాల్సిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి కదా.. తప్పకుండ ఇస్తాము.. నోట్ కూడా విడుదల చేస్తాని లోకేష్ చెప్పారు.

Read Also: Modi-Israel: ఇజ్రాయెల్ వార్తాపత్రిక మొదటి పేజీలో మోడీపై ప్రత్యేక కథనం.. ‘నమస్తే.. షాలోమ్’ అంటూ టైటిల్

ఇక, బొత్స సత్యనారాయణ చిల్లర దొంగలని పట్టుకుని గజ దొంగలని వదిలేస్తున్నారని అన్నారని నారా లోకేష్ గుర్తు చేశారు. జగన్ గజ దొంగనా.. జగన్ ని పట్టుకోవాలని అన్నాడా.. మేము అదే చెప్తున్నాం.. సిట్ విచారణలో తేలింది ఇదే కదా.. మా మీద 6కి పైగా కేసులు పెట్టారు.. స్కిల్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూములు, ఇసుక, లిక్కర్ కేసు లు పెట్టి వేధించారు.. ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు కంపిటేంట్ అథారిటీ నుంచి ఆమోదం పొందాలి.. మంత్రులకైతే గవర్నర్.. ఎమ్మెల్యేల కైతే స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నారు. ఫామ్ 19 ప్రకారం ఎందుకు ఇవ్వలేదు.. ఆ కేసులపై ఆధారాలు ఉంటే గవర్నర్ కి ఎందుకు చూపలేదు.. ఒక్క ఆధారమైన చూపించారా అని లోకేష్ ప్రశ్నించాడు.

Exit mobile version