New Twist in MP Gorantla Madhav Video Episode: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్.. ఆ రిపోర్ట్ ఫేక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది… అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న లేఖ ఒరిజనల్ కాదని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేయడంతో మరోసారి దీనిపై చర్చ తెరపైకి వచ్చింది.. దీనిపై ఏపీ సీఐడీ పెట్టిన మెయిల్ కు సంబంధిత ల్యాబ్ నుంచి వివరణ వచ్చిందని చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై దుమారం రేగింది.. ఆ వీడియో మార్ఫింగ్ అని ఎంపీ మాధవ్ స్పష్టం చేశారని తెలిపారు.. ఇదే సమయంలో ప్రైవేట్ ల్యాబ్లకు సంబంధించిన నివేదికలు చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. ఎక్లిప్స్ ల్యాబ్ పేరుతో కొందరు ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్ అని తేలిందన్న ఆయన.. ఎక్లిప్స్ సంస్థకి చెందిన జిమ్ స్టాఫర్డ్ పేరుతో తిరుగుతోన్న నివేదిక తనది కాదని స్టాఫర్డి నాకు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారని వెల్లడించారు.
Read Also: AP CID Live: AP CID Briefs Media Over MP Gorantla Madhav Video Call Case
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
- Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సర్కులేషన్లో ఉన్న వీడియో ఒరిజనలేనని మాత్రమే ఎక్లిప్స్ సంస్థ చెప్పింది… కానీ, ఓ స్క్రీన్ మీద రన్ అవుతున్నదాన్ని తీసిన వీడియో చూసి రియలా..? ఫేకా..? అనేది ఎవ్వరూ తేల్చలేరని స్పష్టం చేశారు సునీల్ కుమార్.. ఒరిజనల్ ఫుటేజ్ ఉంటేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయని జిమ్ స్టాఫర్డ్ కూడా చెప్పారన్న ఆయన.. తానిచ్చిన నివేదికలో మార్పులు చేర్పులు చేయాల్సిందిగా పోతిని తనను కోరారని జిమ్ స్టాఫర్డ్ స్వయంగా చెప్పారంటూ మరో బాంబ్ పేల్చారు.. ఇక, ఫేక్ డాక్యుమెంట్ సర్కులేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రసాద్ పోతిని సహా తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఐటీ యాక్ట్ 67 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నుంచి నోటీసులు వచ్చాయా..? లేదా..? అనేది డీజీపీనే అడగాలని.. ఆయనే చెబతారని తెలిపారు ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..