పోలవరం పునరావాస పనులు… జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసే పనిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆలస్యం జరిగినా.. పనుల్లో జాప్యం జరగకుండా చ్యలు తీసుకుంటున్నారు. అయితే, పోలవరం పునరావాస పనులపై జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించింది నేషనల్ ఎస్టీ కమిషన్.. పోలవరం ముంపు ప్రాంతాల్లో గిరిజనుల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు.. పోలవరం బాధితుల నుంచి నేషనల్ ఎస్టీ కమిషనుకు 203 ఫిర్యాదుల వరకు అందాయి..
ఇక, తమ పర్యటనపై జాతీయ ఎస్టీ కమిషన్ అనంత్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పునరావాసంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.. పోలవరం బాధితులకు పరిహారం అందలేదు, కాలనీల్లో వసతులూ పూర్తి కాలేదన్న ఆయన.. 2022 నాటికి ముంపు పెరగనుంది.. అయినా ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. గిరిజన రైతులకూ పరిహారం అందించలేదని.. గిరిజనులు తమ సంస్కృతి కోల్పోతున్నారన్న అనంత్ నాయక్.. ప్రాజెక్టు పరిధిలో గిరిజనులకు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.. కానీ, ఇప్పటికి అందించలేదన్నారు.. పునరావాస కాలనీలో విద్యా, వైద్యం, కోసం ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించిన ఆయన.. ప్రాజెక్టు పరిధిలో ఉన్న గిరిజన సమస్యలపై అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.. ప్రాజెక్టులో గిరిజనులకు అన్యాయం జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం అన్నారు అనంత్ నాయక్.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!