మంగళగిరి ఎమ్మెల్యే ఓ గెస్ట్ లెక్చరర్: నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్కే గెస్ట్ లెక్చరర్గా మారారని ఎద్దేవా చేశారు. వారానికి ఒకసారి నియోజకవర్గానికి వచ్చి నాలుగు ఫోటోలు దిగి జంప్ అవుతున్నారంటూ లోకేష్ ఆరోపించారు. గురువారం నాడు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు తాగునీరు, ఇళ్ల పట్టాల సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. రకరకాల కారణాలు చెబుతూ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు కట్ చేస్తున్నారని లోకేష్ వద్ద పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: టీడీపీ-జనసేన పొత్తు..! సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
30 ఏళ్ల క్రితం ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అంటూ రూ.10 వేలు కట్టమని జగన్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10 వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత.. సొంతిల్లు ఉందనే కారణం చూపి పెన్షన్, రేషన్ కార్డ్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఆపేయడం ఖాయమని ఆరోపించారు. ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదలను దోచుకుంటోందని… టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క రూపాయి కూడా కట్టించుకోకుండా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఈ రోజు తాడేపల్లి టౌన్ లో పర్యటించాను. తాగునీరు, ఇళ్ల పట్టాల సమస్యను ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. రకరకాల కారణాలు చెబుతూ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.(1/3) pic.twitter.com/g5lOXdsLWF
— Lokesh Nara (@naralokesh) December 9, 2021
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!