Nara Lokesh: 8 మందిని కాల్చిన చంపిన మీ నాన్న చరిత్ర మర్చిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లాలోని గణపవరంలో సీఎం జగన్ ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఆయనకు ఓ లేఖ రాశారు. అందులో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడిన ఆయన.. పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి, ఇప్పుడు రైతుల్లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చారంటూ ఆరోపించారు. రైతులకి జరిగిన అన్యాయం, వ్యవసాయ రంగ సంక్షోభంతో పాటు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులపై జరిగిన దాష్టీకాలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగన్ దరిద్ర పాదం ఎఫెక్ట్తో రైతు రాజ్యం కాదు కదా.. అసలు రైతు బతికుంటే చాలు, అదే పదివేలు అనేలా దుస్థితి ఉందని లోకేష్ విమర్శించారు. ‘‘అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి, రైతుల మెడకి ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరు? మూడేళ్ల పాలనలో, కనీసం ఒక్కటంటే ఒక్క చిన్న కాలువైనా తవ్వారా? ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ కట్టారా? రైతుల నుంచి గతేడాది కొనుగోలు చేసిన ధాన్యం డబ్బుల్ని ఇచ్చారా? అసలు ఈ ఏడాది ధాన్యం కొన్నారా? రూ. 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ? తుఫాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎంతిచ్చారు? పంటల బీమా ప్రీమియం కట్టామన్నారు.. అలాంటప్పుడు రైతులకి ఎందుకు ఇన్సూరెన్స్ వర్తించలేదు? రూ.12,500 రైతు భరోసా ఇస్తానని మాటిచ్చి.. కేవలం రూ.7,500 ఇస్తోందెవరు? అసలు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులని గుర్తించారా?’’ అంటూ లోకేష్ ఆ లేఖలో ప్రశ్నించారు.
Also Read
అంతేకాదు.. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయని లోకేష్ నిలదీశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ రంగ వ్యతిరేక బిల్లులకు మద్దతిచ్చిన మూర్ఖుడు ఎవరని, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడేను మళ్ళీ తీసుకొచ్చిన అసమర్థుడెవరని అడిగారు. రైతులకు రూ.3 లక్షల వరకు సున్నావడ్డీ నిబంధనని టీడీపీ తీసుకొస్తే.. దాన్ని కేవలం రూ.1 లక్షకే పరిమితం చేసిందెవరన్నారు. ‘‘రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉండడానికి కారణం మీరు కాదా? ముదిగొండలో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్న చరిత్ర మర్చిపోయారా? సోంపేటలో తమ భూముల్ని లాక్కోవద్దని ఆందోళన చేసిన ఆరుగురు రైతుల్ని కాల్చి చంపించింది మీ నాన్న కాదా? రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే, టెర్రరిస్టుల్లా సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడి ఆదేశాలతో?’’ అంటూ ఆ లేఖలో నారా లోకేష్ రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
-
Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
-
Shreyas Iyer Captaincy: 7 మ్యాచ్ల్లో 6 ఓటములు.. శ్రేయస్ కెప్టెన్సీకి పీడకల లాంటి ఆరంభం!
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!