Nara Lokesh: 8 మందిని కాల్చిన చంపిన మీ నాన్న చరిత్ర మర్చిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లాలోని గణపవరంలో సీఎం జగన్ ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఆయనకు ఓ లేఖ రాశారు. అందులో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడిన ఆయన.. పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి, ఇప్పుడు రైతుల్లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చారంటూ ఆరోపించారు. రైతులకి జరిగిన అన్యాయం, వ్యవసాయ రంగ సంక్షోభంతో పాటు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులపై జరిగిన దాష్టీకాలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగన్ దరిద్ర పాదం ఎఫెక్ట్తో రైతు రాజ్యం కాదు కదా.. అసలు రైతు బతికుంటే చాలు, అదే పదివేలు అనేలా దుస్థితి ఉందని లోకేష్ విమర్శించారు. ‘‘అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి, రైతుల మెడకి ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరు? మూడేళ్ల పాలనలో, కనీసం ఒక్కటంటే ఒక్క చిన్న కాలువైనా తవ్వారా? ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ కట్టారా? రైతుల నుంచి గతేడాది కొనుగోలు చేసిన ధాన్యం డబ్బుల్ని ఇచ్చారా? అసలు ఈ ఏడాది ధాన్యం కొన్నారా? రూ. 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ? తుఫాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎంతిచ్చారు? పంటల బీమా ప్రీమియం కట్టామన్నారు.. అలాంటప్పుడు రైతులకి ఎందుకు ఇన్సూరెన్స్ వర్తించలేదు? రూ.12,500 రైతు భరోసా ఇస్తానని మాటిచ్చి.. కేవలం రూ.7,500 ఇస్తోందెవరు? అసలు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులని గుర్తించారా?’’ అంటూ లోకేష్ ఆ లేఖలో ప్రశ్నించారు.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
అంతేకాదు.. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయని లోకేష్ నిలదీశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ రంగ వ్యతిరేక బిల్లులకు మద్దతిచ్చిన మూర్ఖుడు ఎవరని, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడేను మళ్ళీ తీసుకొచ్చిన అసమర్థుడెవరని అడిగారు. రైతులకు రూ.3 లక్షల వరకు సున్నావడ్డీ నిబంధనని టీడీపీ తీసుకొస్తే.. దాన్ని కేవలం రూ.1 లక్షకే పరిమితం చేసిందెవరన్నారు. ‘‘రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉండడానికి కారణం మీరు కాదా? ముదిగొండలో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్న చరిత్ర మర్చిపోయారా? సోంపేటలో తమ భూముల్ని లాక్కోవద్దని ఆందోళన చేసిన ఆరుగురు రైతుల్ని కాల్చి చంపించింది మీ నాన్న కాదా? రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే, టెర్రరిస్టుల్లా సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడి ఆదేశాలతో?’’ అంటూ ఆ లేఖలో నారా లోకేష్ రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!